AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Chapter 1: కాంతార మూవీ టీంకు ఊరట.. చెట్లు నరకలేదన్న అధికారులు

రిషబ్ శెట్టి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కాంతారా: చాప్టర్ 1’ మూవీ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకా యాసలూరు మండలం సంతే సమీపంలోని హేరూర్ గ్రామం గవిబెట్ట పరిసర ప్రాంతాల్లో ‘కాంతారా : చాప్టర్ 1’ చిత్ర బృందం షూటింగ్ జరుపుకుంటోంది.

Kantara Chapter 1: కాంతార మూవీ టీంకు ఊరట.. చెట్లు నరకలేదన్న అధికారులు
Kantara Chapter 1
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2025 | 1:24 PM

Share

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కాంతార: చాప్టర్ 1’. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ దశలోనే ఈ సినిమా ఎన్నో వివాదాలను సృష్టించింది. తాజాగా చిత్ర బృందంపై అటవీ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు వినిపించాయి. షూటింగ్ సమయంలో అడవిని తగులబెట్టారని, చాలా నష్టం జరుగుతోందని అక్కడి స్థానికులు ఆరోపించారు. ఈ కేసులో టీమ్‌కి క్లీన్‌చిట్‌ లభించింది. దీంతో చిత్ర బృందం కాస్త ఊరట పొందింది.

హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని హేరూర్ గ్రామ సమీపంలోని గవిగుడ్డ ప్రాంతంలోని డీమ్డ్ ఫారెస్ట్, ఆవుల భూమిలో షూటింగ్ చేయడానికి కాంతార బృందం అనుమతి పొందింది. ఈ బృందం అక్రమంగా చెట్లను నరికివేయడం, పేలుడు పదార్థాలు ఉపయోగించడంలాంటివి చేసి నిబంధనలను ఉల్లంఘించిందని కొందరు స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అటవీ అధికారుల బృందం నిబంధనల ఉల్లంఘన జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చింది.

‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్ సమయంలో, పేలుళ్లు జరిగాయి, చెట్లు నరికివేశారు, దాని కారణంగా అడవి జంతువులు గ్రామాల్లోకి ప్రవేశించాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై చర్చ జరిగింది.  దీని పై స్పందించిన అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే.. ఈ ఘటనపై విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. స్థల పరిశీలన చేసిన సక్లేస్‌పూర్‌ ఏసీఎఫ్‌ మధు, యాసలూరు డివిజన్‌ ​​ఆర్‌ఎఫ్‌వో కృష్ణ నేతృత్వంలోని బృందం సినిమా షూటింగ్‌ లొకేషన్‌ను సందర్శించి మహజర్‌ నిర్వహించింది. ఆ తర్వాత డీసీఎఫ్‌కు నివేదిక ఇవ్వగా.. ‘ఏ నిబంధనను ఉల్లంఘించలేదని’ నివేదికలో పేర్కొన్నారు. జనవరి 4న డీమ్డ్ ఫారెస్ట్‌లో అనుమతి లేకుండా షూటింగ్ యాక్సెసరీస్ తీసుకొచ్చినందుకు 50 వేల జరిమానా విధించారు. అంతే కాకుండా ఎలాంటి బ్లాస్టింగ్‌లు చేయలేదని, చెట్లను నరికివేయలేదని, కలప వంటి రంగులు వేసిన వస్తువులను ఉపయోగించారని నివేదికలో పేర్కొన్నారు. దీంతో కాంతార మూవీ టీంకు పెద్ద ఊరట లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.