బాహుబలి తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో.. రాధేశ్యామ్ సినిమాలతో అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలో డార్లింగ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ జూన్ 16న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి రాముడిగా కనిపించబోతుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ మాసివ్ విజువల్ వండర్ థియేట్రికల్ ట్రైలర్ తర్వాత లెవెల్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా 3డి వెర్షన్ లో అయితే సెన్సేషన్ సెట్ చేసిన ఈ ట్రైలర్ విడుదలను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్.
ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ ఓంరౌత్ ఓ బ్యూటీఫుల్ పిక్ చేశారు. అదెంటంటే.. హీరో ప్రభాస్ తో కలిసి ట్రైలర్ చూస్తున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. 3డి గ్లాసెస్ పెట్టుకుని ట్రైలర్ చూస్తూ కనిపించారు ఇద్దరూ కూడా. యే దోస్తీ అంటూ 3డిలలో ఆదిపురుష్ ట్రైలర్ నా స్నేహితుడితో కలిసి చూస్తున్నాను అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయనుంది. ఇందులో సన్నీసింగ్, దేవదత్త నాగే వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నఈ సినిమా జూన్ 16న పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు.
Ye Dosti gehri hai aur picture bhi 3D hai…#Prabhas ✨
Thank you very much for a lovely response to the Adipurush trailer… Watch Adipurush in 3D.#JaiShriRam#Adipurush pic.twitter.com/4qz06XkbSt
— Om Raut (@omraut) May 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.