AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ఆదిపురుష్ వివాదం పై స్పందించిన హైకోర్టు.. ఏమని తీర్పునిచ్చిందంటే..

ఇప్పటికే సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా.. మరోవైపు నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని.. ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Adipurush: ఆదిపురుష్ వివాదం పై స్పందించిన హైకోర్టు.. ఏమని తీర్పునిచ్చిందంటే..
ఇప్పటివరకు రూ. 400 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో ఆదిపురుష్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి.
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2023 | 9:50 PM

Share

ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా విడుదలైన చిత్రం ఆదిపురుష్. జూన్ 16న రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా.. మరోవైపు నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని.. ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ సినిమాపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదే పిటిషన్ పై జూన్ 30న విచారణకు రావాలని ఆదేశించింది. సినిమా ఇప్పటికే విడుదలైందని.. రిలీజ్ డేట్ కూడా ముందుగానే తెలుసు అని ఆ సమయంలో అత్యవసర విచారణ కోసం ఎలాంటి కేసు పెట్టలేదని కోర్టు పేర్కొంది.

పిటిషనల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. నేపాల్ ఈ సినిమాను నిషేధించినందున అంతర్జాతీయ సంబంధాలకు ఆటంకం కలిగించే విధంగా ఈ సినిమాలో అనేక వివాదాస్పద భాగాలు ఉన్నాయని.. అయితే విడుదలకు ముందే ఆ సన్నివేశాలను తొలగిస్తామని డైరెక్టర్ ఓంరౌత్ చెప్పారని.. కానీ అలా చేయకుండా నేరుగా ఈ సినిమాను విడుదల చేశారని అన్నారు. వాల్కీకి, తులసీదాస్ వంటి రచయితలు రచించిన రామయాణం కాకుండా.. ఆదిపురుష్ అంటూ అనుచితమైన రీతిలో ఈ సినిమాను తెరకెక్కించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పిటిషన్లో పేర్కొన్నారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని.. ఈ మేరకు అత్యవసర విచారణ జరపాలని హిందూ సేన లాయర్ కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది.

ఇదిలా ఉంటే.. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటీనటులు ఆదిపురుష్ చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన రామాయణాన్ని డైరెక్టర్ ఓంరౌత్ అపహాస్యం చేశారని అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఓవైపు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతుండగా.. మరోవైపు సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. రాత పరీక్ష ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. రాత పరీక్ష ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే