AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic: టాక్సిక్‌ టీజర్‌పై మొదలైన రచ్చ.. ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్..

రాక్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ విడుదలను నిలిపివేయాలని లేదా మార్గదర్శకాలతో టీజర్ విడుదల చేయాలని కోరుతూ న్యాయవాది లోహిత్ సెన్సార్ బోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డుకు లేఖ రాయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. టీజర్ లో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

Toxic: టాక్సిక్‌ టీజర్‌పై మొదలైన రచ్చ.. ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్..
Yash
Rajitha Chanti
|

Updated on: Jan 10, 2026 | 1:14 PM

Share

పాన్ ఇండియా స్టార్ యశ్‌ హీరోగా రూపొందుతున్న సినిమా టాక్సిక్‌. ఈ మూవీని మలాయళం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గీతూమోహన్‌దాస్‌ దర్శకత్వం వహించారు. ‘కేజీయఫ్‌’ లాంటి భారీ హిట్స్ తర్వాత యశ్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. విడుదలైన కాసేపటికే ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అసలు అభిమానులు ఎక్సెప్ట్ చేయని రేంజ్ లో టీజర్ రిలీజ్ చేసి షాకిచ్చారు డైరెక్టర్. దీంతో ఒక్కసారిగా టాక్సిక్ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే అందులో ఇంటిమేట్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో శ్మశానం దగ్గర కారులో కొన్ని ఇంటిమేట్‌ సన్నివేశాలు చూపించారు. ఈ సన్నివేశాలపైనే పలువురు మండిపడుతున్నారు. వెంటనే సన్నివేశాలు తొలగించాలంటున్నారు. ఇలాంటి సినిమాలకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వొద్దంటూ అడ్వకేట్‌ లోహిత్ సెన్సార్‌ బోర్డుకు లేఖ రాశారు. యూట్యూబ్, ఫేస్ బుక్ లో పెద్దలకు మాత్రమే అని చెప్పే కమ్యూనిటీ మార్గదర్శకాలు ఉన్నాయని.. కానీ టీజర్ లో మాత్రం అసభ్యకరమైన కంటెంట్ చూపించారని.. దీంతో పిల్లల చట్టాలను ఉల్లంఘించారని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ఇప్పుడు ఆ మార్గదర్శకాలు అమలులోకి వచ్చి ఉంటే సినిమా టీజర్ చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలని అడ్వకేట్ లోహిత్ అన్నారు. ఇది కుటుంబ సమేతంగా చూసే సినిమా కాదని, చిన్న పిల్లలకు చూపించకూడదని ముందుగానే హెచ్చరించాలి. చాలా మంది తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి టీజర్ చూసిన తర్వాత తమ నిరాశను వ్యక్తం చేశారని లోహిత్ అన్నారు. సెన్సార్ బోర్డు ఇప్పటికే ఉన్న టీజర్‌ను నిలిపివేసి మార్గదర్శకాలు ఇస్తేనే టీజర్‌ను విడుదల చేయవచ్చని చెప్పాలి. జాగ్రత్త సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత టీజర్‌ను విడుదల చేయవచ్చని లోహిత్ అన్నారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..