AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు తెలుగు సినిమా చూసిన తొలి స్టార్ హీరో.. లక్షల్లో పారితోషికం.. చివరకు ఆకలితో..

దక్షిణాదిన తొలి స్టార్ హీరో, చిత్తూరు నాగయ్య అపారమైన కీర్తి, సంపద, దాతృత్వాన్ని సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి నుంచి గౌరవం పొందిన ఆయన, చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఒకనాడు వాహిని స్టూడియోలో శోభన్ బాబు ఆయన దుస్థితిని గమనించి, సహాయం అందించారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు తెలుగు సినిమా చూసిన తొలి స్టార్ హీరో.. లక్షల్లో పారితోషికం.. చివరకు ఆకలితో..
Tollywood Superstar
Ravi Kiran
|

Updated on: May 10, 2026 | 9:01 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో తారలు మెరిశారు. కానీ చిత్తూరు నాగయ్య ప్రస్థానం మాత్రం అత్యంత అరుదైనది, ఆశ్చర్యకరమైనది. ఒకప్పుడు దక్షిణ భారతదేశానికే తొలి సూపర్ స్టార్‌గా వెలిగి, రాష్ట్రపతి సైతం పాదాభివందనం చేసే స్థాయికి ఎదిగిన మహానటుడు ఆయన. త్యాగయ్య, భక్త పోతన, యోగి వేమన చిత్రాలతో అసాధారణ కీర్తిని సంపాదించిన నాగయ్య జీవితం.. ఒక స్టార్ హీరో ఎదుగుదలకు, ఆయనలోని అపార దాతృత్వానికి, చివరి రోజుల్లో అనుభవించిన విషాదానికి నిలువెత్తు సాక్ష్యం. పంతొమ్మిది వందల నలభై, యాభైల కాలంలో తెలుగు సినిమా అంటే నాగయ్య. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులు సినిమాకు ఐదు వేలు లేదా పది వేల రూపాయల పారితోషికం తీసుకుంటున్న రోజుల్లోనే, నాగయ్య ఏకంగా లక్ష నుండి రెండు లక్షల రూపాయలు వసూలు చేసేవారట. ఆ కాలంలో ఇది ఒక అసాధారణమైన విషయం.

ఇది చదవండి: ఆ స్టార్ హీరోకు పెద్ద ఫ్యాన్.. కానీ అప్పుడు నన్ను అలా అనేసరికి షాకయ్యా..

కానీ ఆయన సంపాదించిన సొమ్మును తన కోసం దాచుకోలేదు. తన స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆకలి తీర్చే అన్నదాతగా ఆయన పేరుగాంచారు. కళాకారులు, విద్యార్థులు అనే తేడా లేకుండా ప్రతిరోజూ వందల మందికి స్వయంగా పిలిచి భోజనాలు పెట్టించేవారు. ఆయన దాతృత్వం ముందు సంపాదన చిన్నబోయింది. అందుకే ఆయనను అందరూ ‘విశ్వదాత’ అని గౌరవంగా పిలుచుకునేవారు. దురదృష్టవశాత్తు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరికీ అన్నం పెట్టిన ఆ చేతులే చివరి రోజుల్లో తినడానికి తిండి లేక అలమటించాల్సి వచ్చింది. అగ్ర హీరోగా వెలిగిన నాగయ్య, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న చిన్న వేషాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు స్టూడియోలనే శాసించిన ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి సెట్స్‌లో వేచి ఉండటం సినీ చరిత్రలోనే ఒక విషాద ఘట్టం.

ఇవి కూడా చదవండి

ఒక రోజు వాహిని స్టూడియోలో జరిగిన సంఘటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. నాగయ్య ‘పిట్టల దొర’ వేషం వేసి, తన షాట్ కోసం గంటల తరబడి ఆకలి దప్పులతో ఎదురుచూస్తున్నారు. తీరా సమయం వచ్చాక, అక్కడి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి “ఈ రోజు షాట్ లేదు, రెండు రోజుల తర్వాత రండి” అని నిర్లక్ష్యంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న నాగయ్య నిస్సహాయంగా, బాధతో అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శోభన్ బాబు ఈ దృశ్యాన్ని చూశారు. ఒక మహానుభావుడు, తాను ఆరాధించే నటుడు ఇలాంటి స్థితిలో ఉండటం చూసి ఆయన మనసు ద్రవించిపోయింది. వెంటనే డైరెక్టర్‌ను పిలిచి, ఆ షాట్‌ను వెంటనే పూర్తి చేయాలని పట్టుబట్టారు. పని పూర్తయిన తర్వాత, నాగయ్య పాదాలకు నమస్కరించి తన గౌరవాన్ని చాటుకున్నారు శోభన్ బాబు.

ఇది చదవండి: నీలాగే నాకు ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీకే మొగుడు అయ్యాడు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us