AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్ర కోసం బిగ్ బాస్ టాస్క్.. ఇరకాటంలో పడ్డ శివాజీ, శోభా

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో ఫైనలిస్ట్ అవ్వడానికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్ర కోసం బిగ్ బాస్ టాస్క్.. ఇరకాటంలో పడ్డ శివాజీ, శోభా
Bigg Boss7
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2023 | 4:20 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 మరికొద్ది వారాల్లో పూర్తికానుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇక నిన్నటి వరకు నామినేషన్స్ హంగామా జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో ఫైనలిస్ట్ అవ్వడానికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మొట్ట మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని సంపాదించుకునేందుకు హౌస్‌మెట్స్‌కి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రతి కంటెస్టెంట్‌ను ఒక్కో బండ మీద నిలబెట్టి మధ్యలో ఓ రాడ్ ను ఉంచాడు ఆ రాడ్ తిరుగుతూ ఉంటే ఆ రాడ్ నుంచి తప్పించుకు తిరగాలి అని చెప్పాడు బిగ్ బాస్. దాని నుంచి తప్పించుకోవాలి అని చెప్పాడు.

ఈ గేమ్ లో దాదాపు అందరూ అవుట్ అయ్యారు. చివరకు అర్జున్, ప్రియాంక ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో సెకండ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో పూలను సేకరించాలని చెప్పాడు. ఎవరైతే ఎక్కువ పూలు సేకరిస్తారో వారే విజేత అని తెలిపాడు. అయితే ఈ టాస్క్ లో శివాజీ, శోభా తక్కువ పూలు సేకరించారు.

దాంతో వారు కలెక్ట్ చేసిన పూలను మిగిలిన వారికి ఇవ్వాలని చెప్పాడు. అయితే అమర్ శివాజీ దగ్గరకు వచ్చి అన్న నువ్వు నాకు మాటిచ్చావ్.. అని అంటే నీకు శోభా ఇస్తుంది లేరా అని అన్నాడు శివాజీ.. కాదు నువ్వే ఇవ్వాలి అని అన్నాడు అమర్. ఆ తర్వాత శోభా శెట్టి , శివాజీ ఇద్దరు కలిసి ఒకరికే తమ పూలను ఇవ్వాలి అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో శివాజీ షాక్ అయ్యాడు. శోభా శెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ఉంటుందని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి