AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహి. వి. రాఘవ్.. బ‌న్నీని మాయ చేశాడా..?

ఈ ఏడాది పొంగ‌ల్ కి అల వైకుంఠ‌పురం సినిమాతో వ‌చ్చి స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ ఇండ‌స్ట్రీ లెక్క‌లు స‌రిచేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ట‌య్యింది.

మహి. వి. రాఘవ్.. బ‌న్నీని మాయ చేశాడా..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 4:25 PM

Share

ఈ ఏడాది పొంగ‌ల్ కి అల వైకుంఠ‌పురం సినిమాతో వ‌చ్చి స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ ఇండ‌స్ట్రీ లెక్క‌లు స‌రిచేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ట‌య్యింది. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గ‌తంలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వీరు హ్యాట్రిక్ పై ఫోక‌స్ పెట్టారు. ‘పుష్ప’ మూవీని పాన్ ఇండియా లెవ‌ల్ లో ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు ఈ మూవీ నాలుగు భాషల్లో విడుద‌ల‌ కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేప‌థ్యంలో వస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా బ్యూటిఫుల్ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మ‌రో ప్రాజెక్ట్ కు కూడా స్టైలిష్ స్టార్ ఓకే చెప్పారని సమాచారం.

ఆనందో బ్రహ్మ, దివంగ‌త నేత‌ వైఎస్సార్ బ‌యోపిక్ ‘యాత్ర’ సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న‌ మహి. వి. రాఘవ్ గ్రీన్ చెప్పిఈ ఏడాది పొంగ‌ల్ కి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో వ‌చ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ లెక్న లైన్ బన్నీకి న‌చ్చింద‌ట‌. దీంతో అత‌డిని పూర్తి స్క్రిప్ట్‌పై ఫోక‌స్ పెట్ట‌మ‌ని చెప్పాడ‌ని స‌మాచారం.