AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్.. ‘పుష్ప’ స్టోరీని సుకుమార్ అలా ప్లాన్ చేశాడా ?

Pushpa Movie Update: టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ.. 'పుష్ప'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప..

Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్.. 'పుష్ప' స్టోరీని సుకుమార్ అలా ప్లాన్ చేశాడా ?
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: May 06, 2021 | 9:21 PM

Share

Pushpa Movie Update: టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ.. ‘పుష్ప’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప.. టీజర్ తోనే రికార్డుల మోత మోగిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న ఈ సినిమా స్టోరీ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అసలు ఇప్పటివరకు ఎవరూ ఊహించని రూమర్ ఒకటి వినిపిస్తోంది.

ఇటీవల తగ్గేదే లే అంటూ వచ్చిన పుష్ప టీజర్.. అతి తక్కువ సమయంలోనే 60 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఐకాన్ స్టార్, టాలెంటెడ్ డైరెక్టర్ కలిస్తే.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే అంటూ.. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా.. ఆడియన్స్ ను ఎంతలా మెస్మరైజ్ చేశాయో తెలిసిందే. ఇక ఆర్య తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్పపై ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అయితే పుష్ప కూడా ఆర్యలా రెండు పార్ట్స్ గా తీసుకొస్తారనే న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే టాక్ ట్రెండ్ అవుతోంది. ఈ ఏడాది ఫస్ట్ పార్ట్, వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ విడుదల చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటుందట. దీనికి హీరో, డైరెక్టర్, చిత్ర నిర్మాణ సంస్థ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ కథనాలు వస్తున్నాయి. ఆర్య, బాహుబలి లేటెస్ట్ గా కేజీఎఫ్ కు కూడా సీక్వెల్ వస్తున్నాయి. దీంతో పుష్ప కూడా సీక్వెల్ చేస్తేనే.. కరోనా నష్టాలను పూడ్చుకోవచ్చంటూ నిర్మాతలు భావిస్తున్నారట. ఇక కరోనా సమయంలోనూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. అయితే ఈ క్రమంలోనే బన్నీ కరోనా బారిన పడగా.. చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఇక ఆర్య లాగే పుష్ప కూడా సిక్వెల్ గా వస్తే బన్నీ ఫ్యాన్స్ కు పండగే..

Also Read: పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు