Ajith Kumar: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. మరింత ఆలస్యం కానున్న అజిత్ వలిమై సినిమా..
కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వలిమై. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా...
Ajith: కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వలిమై. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా డీలే అవుతోంది. షూటింగ్ షెడ్యూల్స్ మీద కూడా కరోనా ఎఫెక్ట్ పడటంతో ఇప్పట్లో సినిమా కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా సీన్స్ రీ షూట్ చేయాల్సి ఉందట. కరోనాకు ముందు సీనియర్ నటులతో కొన్ని సీన్స్ షూట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ నటులు షూటింగ్ చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో చాలా సీన్స్ను కొత్త వారితో రీషూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ రీషూట్స్ కారణంగా సినిమా మరింత ఆలస్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ మాత్రం వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పర్మిషన్ రాగానే షూట్ స్టార్ట్ చేసి… దీపావళికి సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ టార్గెట్ను వలిమై మేకర్స్ రీచ్ అవుతారో లేదో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :