AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: అజిత్ గ్యారేజీలోకి మరో కొత్త లగ్జరీ కారు.. ఫొటోస్ షేర్ చేసిన భార్య షాలినీ.. ధర ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు కార్లు, బైక్‌లంటే పిచ్చి. ఈ విషయం ఆయన అభిమానులకు బాగా తెలుసు. అజిత్ దగ్గర ఇప్పటికే చాలా కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వారి లగ్జరీ కార్ల జాబితాలో మరో కొత్త కారు చేరిపోయింది. తాజాగా అజిత్ కొత్త పోర్షే 911 GT3 RS కారును కొనుగోలు చేశాడు

Ajith Kumar: అజిత్ గ్యారేజీలోకి మరో కొత్త లగ్జరీ కారు.. ఫొటోస్ షేర్ చేసిన భార్య షాలినీ.. ధర ఎన్ని కోట్లంటే?
Ajith Kumar Family
Basha Shek
|

Updated on: Sep 15, 2024 | 1:24 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు కార్లు, బైక్‌లంటే పిచ్చి. ఈ విషయం ఆయన అభిమానులకు బాగా తెలుసు. అజిత్ దగ్గర ఇప్పటికే చాలా కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వారి లగ్జరీ కార్ల జాబితాలో మరో కొత్త కారు చేరిపోయింది. తాజాగా అజిత్ కొత్త పోర్షే 911 GT3 RS కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ధర రూ. 3.5 కోట్లు. కొత్త కారుతో అజిత్ సంతోషంగా పోజులిచ్చాడు . ఆ క్షణాన్ని భార్య షాలిని ఫోటో క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు అజిత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ‘విడముయార్చి’ చిత్రంలో అజిత్ నటిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో కార్ యాక్షన్ సీన్స్ కూడా ఉండనున్నాయి. షూటింగ్ సమయంలో అజిత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. దీనికి సంబంధించిన వీడియో కూడాసామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్ని కారణాలతో ‘విడముయార్చి’ హైప్ క్రియేట్ చేసింది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో..

విడముయార్చి తర్వాత ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ సినిమాలో నటించనున్నాడు అజిత్. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఆ తర్వాత నటుడు యశ్‌తో కలిసి అజిత్ ‘కేజీఎఫ్ 3’ చిత్రంలో నటించనున్నాడు. కాగా అజిత్ భార్య షాలిని కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘లవ్ యు ఎప్పటికీ’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫోటో చూసిన అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే షాలిని ఇప్పుడు కోలుకుంది. రీసెంట్ గా గౌరీ-గణేశ పండుగను ఘనంగా జరుపుకుంది షాలిని. ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

కొత్త కారుతో హీరో అజిత్ కుమార్ పోజులు.. ఫొటోస్ ఇదిగో..

వినాయక చవితి వేడుకల్లో షామిలీ, షాలినీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us