AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: పొన్నియిన్ సెల్వన్‍‏లో త్రిష ధరించిన నగల వెనకాల పెద్ద కథే ఉందిగా.. ఆసక్తికర విషయాలను చెప్పిన త్రిష..

ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న ఆడియన్స్ ముందుకు రానుంది

Trisha: పొన్నియిన్ సెల్వన్‍‏లో త్రిష ధరించిన నగల వెనకాల పెద్ద కథే ఉందిగా.. ఆసక్తికర విషయాలను చెప్పిన త్రిష..
Trisha
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2022 | 9:21 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ త్రిష (Trisha) ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ద్వారా చోళ రాజవంశాన్ని వెండితెరపై చూపించబోతున్నారు మణిరత్నం. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో పాల్గోంటున్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ సినిమాలో తాను ధరించిన నగలన్ని నిజమైనవే అని చెప్పారు త్రిష.

తాను ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో త్రిష చోళ దేశపు రాకుమారి కుందవై పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో త్రిష ధరించిన నగలన్ని నిజమైనవే అని తెలిపారు. “పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నా పాత్రల చాలా సహజంగా ఉంటుంది. ఇందులో నేను చోళ రాకుమారిగా కనిపించనున్నారు. నేను పోషిస్తున్న కుందవై పాత్ర పట్ల చాలా శ్రద్ద తీసుకున్నాము. ఆనాటి రాజుల ఆహార్యం తలపించేలా దుస్తులు, నగలను ఎంపిక చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేను నిజమైన నగలే ధరించాను. మాకు సహకారం అందించిన అందరికి ధన్యవాదాలు. మణిరత్నం సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నా పాత్రకు పూర్తిగా న్యాయం చేశాను అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు త్రిష. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న ఆడియన్స్ ముందుకు రానుంది.