“తెలుగులో నటించడం కలే అనుకున్నా”
అగ్రకథానాయకుల పక్కన నటిస్తూ, వరస విజయాలు అందుకుంటూ ప్రస్తుతం మంచి జోరుమీదుంది హీరోయిన్ రష్మిక మందన. త్వరలో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకోబోతుంది ఈ సుందరాంగి.
Actress Rashmika Mandanna : అగ్రకథానాయకుల పక్కన నటిస్తూ, వరస విజయాలు అందుకుంటూ ప్రస్తుతం మంచి జోరుమీదుంది హీరోయిన్ రష్మిక మందన. త్వరలో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకోబోతుంది ఈ సుందరాంగి. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఎప్పుడైనా మూవీ ఫీల్డ్ వదిలేసి వెళ్లాలనే ఆలోచన వచ్చిందా అనే ప్రశ్న అడగ్గా..చాలా పెద్ద సమాధానమే చెప్పింది.
“వాస్తవానికి.. నాకు ఫస్ట్ మూవీ చేసిన వెంటనే ఇలాంటి ఆలోచన వచ్చింది. నా ఫస్ట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ రిలీజవ్వగానే తెలుగు నుంచి అనేక ఆఫర్స్ వచ్చాయి. కానీ, అప్పటికి నేను సినిమాలే కంప్లీట్గా వదిలేద్దామనుకున్నా. తెలుగులో నటించడమైతే ఇక కుదరదనే అనుకున్నా. ఎందుకంటే తెలుగు భాషలో నాకు కనీస అవగాహన లేదు. దాంతో ఇటువైపు వచ్చే ఆలోచనే చేయలేదు. కానీ, ఫస్ట్ విక్టరీ అందించిన ఉత్సాహం, స్ఫూర్తితో కొన్ని కన్నడ సినిమాలు సైన్ చేశా. దాంతో తెలుగు నుంచి ఛాన్సులొచ్చినా తొలి రెండేళ్లు ఇక్కడ మూవీస్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ‘కిరిక్ పార్టీ’ చూసి డైరెక్టర్ వెంకీ కుడుముల ‘ఛలో’ కోసం నన్ను సంప్రదించారు. ఆయన చెప్పిన స్టోరీ, అందులోని నా పాత్ర విపరీతంగా నచ్చి ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. ఇక ఆ తర్వాత వరుస విజయాలతో తెలుగులో ముందుకు వెళ్తున్నా. ఇప్పుడీ ప్రయాణాన్ని తలచుకుంటుంటే ఓ డ్రీమ్లా అనిపిస్తుంటుంది”. అని రష్మిక వివరించింది.
Also Read :
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు