AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mannara Chopra: పింపుల్స్ ఉన్నాయని నన్ను రిజెక్ట్ చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రేమ గీమ జాంత నై అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సునీల్ జక్కన్న, సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాల్లో నటించింది. అలాగే రోగ్, సీత సినిమా లో నటించింది. ఇప్పుడు తిరగబడరా సామి అనే సినిమాలో చేస్తుంది.

Mannara Chopra: పింపుల్స్ ఉన్నాయని నన్ను రిజెక్ట్ చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
Mannara Chopra
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2024 | 3:52 PM

Share

బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్.  ఇక మన్నార్ చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రేమ గీమ జాంత నై అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సునీల్ జక్కన్న, సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాల్లో నటించింది. అలాగే రోగ్, సీత సినిమా లో నటించింది. ఇప్పుడు తిరగబడరా సామి అనే సినిమాలో చేస్తుంది. సినిమాలతో పాటు రియాల్టీ షోలలోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. పలు ప్రకటనల్లో కూడా నటించింది మన్నార. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ బ్యూటీ. ముఖం మీద మొటిమల కారణంగా ఓ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయానని తెలిపింది.

కొంతమంది నటీమణులు ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనల్లో నటించడానికి ఇష్టపడరు. అయితే మన్నారా చోప్రా అలా కాదు. ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనలో నటించేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంది. అందుకోసం చాలా రౌండ్స్ ఆడిషన్ కూడా ఇచ్చింది. అయితే ఎట్టకేలకు ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ లో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే ఆ యాడ్ షూట్ చేసే సమయానికి తన మొఖం పై  మొటిమలు వచ్చాయట.

‘‘షూట్‌కి ముందు రోజు రాత్రి నా నుదిటిపై మొటిమ వచ్చింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు యాడ్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు మొటిమలు ఎక్కువయ్యాయి. నేను వాటిని కనిపించకుండా చేద్దాం అని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. దాంతో నన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. అదే నా జీవితంలో మొదటి రిజక్షన్’’ అని మన్నారా చోప్రా పేర్కొంది. ఆ రోజు మన్నారా చోప్రా ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. మొటిమల కారణంగా ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నానని చాలా బాధపడిందట. మన్నారా చోప్రా హిందీ బిగ్ బాస్ 17′ షోపాల్గొంది. ఆ షోలో ఆమె  2వ రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 38 లక్షల మంది ఈ ముద్దుగుమ్మను ఫాలో అవుతున్నారు.

మన్నారా చోప్రా..

View this post on Instagram

A post shared by Mannara Chopra (@memannara)

మన్నారా చోప్రా..

View this post on Instagram

A post shared by Mannara Chopra (@memannara)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.