AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vishal: విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. అసలు విషయం చెప్పిన ఖుష్బూ..

గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన హీరో విశాల్ వీడియోస్ కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మదగజరాజు సినిమా ఈవెంట్‏లో ఊహించని లుక్‏లో కనిపించిన విశాల్‏ను చూసి షాకయ్యారు జనాలు. ఈ వేడుకలో ఆయన వణుకుతూ కనిపించడంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Actor Vishal: విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. అసలు విషయం చెప్పిన ఖుష్బూ..
Kushboo, Vishal
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2025 | 10:06 AM

Share

తమిళ్ స్టార్ హీరో విశాల్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న విశాల్.. ఇటీవల జరిగిన మదగజరాజు మూవీ ఈవెంట్లో పాల్గొన్నాయి. అయితే ఈ వేడుకలో విశాల్ ఊహించని లుక్‏లో కనిపించడంతో అభిమానులు షాకయ్యారు. పూర్తిగా బక్కగా మారిపోయి వణుకుతూ కనిపించారు. అలాగే మాట సైతం స్పష్టంగా మాట్లాడలేకపోయారు. కనీసం నిలబడేందుకు కూడా విశాల్ ఇబ్బంది పడడం చూసి ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే విశాల్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయన టీమ్ చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విశాల్ ఆరోగ్యం గురించి రోజుకో వీడియో షేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు.

ఖుష్బూ మాట్లాడుతూ.. “విశాల్‏కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చింది. కానీ మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందని తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆ మూవీ వేడుకకు వచ్చారు. ఆరోజు విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత అడియన్స్ ముందుకు వస్తుందని.. అందుకే తాను కచ్చితంగా రావాలనుకున్నానని చెప్పారు. ఆ వేడుక రోజున విశాల్ కు 103 డిగ్రీల జ్వరం ఉంది. అందుకే ఆయన వణికిపోయారు. ఆ ఈవెంట్ పూర్తికాగానే మేం విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. విశాల్ ఆరోగ్యం గురించి ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు. అలాగే విశాల్ ఆరోగ్యం గురించి కొంతమంది యూట్యూబర్స్ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎలాంటి నిజాలు తెలుసుకోకుండానే తేలికగా రూమర్స్ రాసేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

విశాల్ తో తాను సినిమా చేయలేదని.. కానీ తమ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపింది ఖుష్భూ. ఇద్దరం పార్టీలో కలిశామని.. ఆ తర్వాతే తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపింది. విశాల్ టాలెంటెడ్ హీరో అని.. తనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉందని చెప్పుకొచ్చింది. విశాల్ హీరోగా నటించిన మదగజరాజు సినిమాకు ఖుష్బూ భర్త సుందర్ . సి దర్శకత్వం వహించారు. ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించగా.. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.