AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవుతా.. మనసులో మాట చెప్పిన జాన్వీ

పాన్ ఇండియా సినీ పరిశ్రమలో చేతినిండా సినిమాలతో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ.. ఇప్పుడు దేవర 2, ఆర్సీ 16 సినిమాలతోపాటు.. హిందీలోనూ పలు సినిమాలు చేస్తుంది.

సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవుతా.. మనసులో మాట చెప్పిన జాన్వీ
Janhvi Kapoor
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2025 | 9:55 AM

Share

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా మారుతుంది. ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వీ. తాజాగా జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది జాన్వీ.

జాన్వీ కపూర్‌కి తిరుపతి అంటే ప్రత్యేక అభిమానం ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నిఆమె ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తిరుపతికి పలుసార్లు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను కూడా తెలిపింది ఈ బ్యూటీ. తాజాగా జాన్వీ మాట్లాడుతూ.. తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని ఉందని తెలిపింది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో కూడా ఉన్న అని చెప్పుకొచ్చింది జాన్వీ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా కరణ్ జోహార్ షోలో జాన్వీ మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకుని తిరుమలలో భర్తతో సెటిల్ అవ్వాలి. ముగ్గురు పిల్లతో హాయిగా గడపాలి, ప్రతిరోజూ అరటి ఆకులో అన్నం తినాలి, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలి’ అని జాన్వీ కపూర్ తెలిపింది. అయితే ఇందులో రొమాంటిక్ ఇష్యూ ఏంటనేది పక్కనే కూర్చున్న కరణ్ జోహార్ కు తెలియలేదు. 2018లో విడుదలైన ‘ధకడ్’ సినిమాతో జాన్వీ ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.