AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: అందుకే విలన్ పాత్రలు చేయాల్సి వచ్చింది.. హీరో గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాను సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం తొలివలపు నిర్మాత ఎ. నాగేశ్వరరావు అని తెలిపారు.. ముందుగా తనపై ఆ సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సందేహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు.

Gopichand: అందుకే విలన్ పాత్రలు చేయాల్సి వచ్చింది.. హీరో గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Gopichand
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2022 | 5:36 PM

Share

సినీ పరిశ్రమలో విలన్ పాత్రలతో మెప్పించి ఆ తర్వాత హీరోలుగా మారిన స్టార్స్ ఎందరో ఉన్నారు.. మోహన్ బాబు, శ్రీకాంత్ వంటి స్టార్స్ సైతం ఒకప్పుడు విలనిజాన్ని పండించి అదరగొట్టారు.. అలా పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టి.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు గోపిచంద్.. తొలివలపు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. జయం సినిమాలో విలన్‏గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిజం, వర్షం మూవీస్ లోనూ విలనిజాన్ని చూపించారు.. ఈ చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా మెప్పించిన గోపిచంద్ (Gopichand) యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా స్క్రీన్ పై అలరించాడు..ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో విలన్ పాత్రలకు స్వస్తి చెప్పారు.. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపిచంద్ తాను విలన్ పాత్రలు ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.

తాను సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం తొలివలపు నిర్మాత ఎ. నాగేశ్వరరావు అని తెలిపారు.. ముందుగా తనపై ఆ సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సందేహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు.. ఇప్పటివరకు తాను చేసిన చిత్రాలు యజ్ఞం, రణం, లౌక్యం, శంఖం, సాహసం టైటిల్స్ సెంటిమెంట్ తో పెట్టినవి కాదని… చెప్పుకొచ్చారు.. ఇక విలన్ పాత్రలు అనేది కేవలం అప్పుడున్న పరిస్థితుల కారణంగా మాత్రమే చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. వర్షం సినిమా కంటే ముందే ప్రభాస్ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. ఇక విడుదలకు సిద్ధమైన పక్కా కమర్షియల్ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా దూసుకుపోతున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు మిస్
ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు మిస్
పాలకూర త్వరగా వాడిపోతుందా?.. ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా పాడవదు
పాలకూర త్వరగా వాడిపోతుందా?.. ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా పాడవదు
రోహిణి కుజుడి కటాక్షం..ఆ రాశులకు అదృష్టం, సంపద వృద్ధి
రోహిణి కుజుడి కటాక్షం..ఆ రాశులకు అదృష్టం, సంపద వృద్ధి
బియ్యానికి పురుగులు పట్టాయి.. ఇలా సింపుల్‌గా తరిమికొట్టండి
బియ్యానికి పురుగులు పట్టాయి.. ఇలా సింపుల్‌గా తరిమికొట్టండి
సముద్రమంత శోకంలోనూ గొప్ప మనసు చాటుకున్న పేరెంట్స్..
సముద్రమంత శోకంలోనూ గొప్ప మనసు చాటుకున్న పేరెంట్స్..
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మళ్లీ వాయిదా పడిన ఆ సిరీస్..?
ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మళ్లీ వాయిదా పడిన ఆ సిరీస్..?
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. ఒకేసారి ఎంతంటే.. ఇక జాతరే..
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. ఒకేసారి ఎంతంటే.. ఇక జాతరే..
గురు, రవి కటాక్షం..ఈ రాశుల వారు నాయకులుగా ఎదుగుతారు..!
గురు, రవి కటాక్షం..ఈ రాశుల వారు నాయకులుగా ఎదుగుతారు..!