Tollywood: సంచలన నిర్ణయం తీసుకున్న ఫిలిం ఛాంబర్.. సోమవారం నుంచి షూటింగ్స్ బంద్..
Tollywood:తెలుగు ఫిలించ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుంచి సినిమా షూటింగ్స్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లన్నీ నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని...
Tollywood:తెలుగు ఫిలించ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుంచి సినిమా షూటింగ్స్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లన్నీ నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులు సినిమా చిత్రీకరణ ఆపేస్తున్నట్లు ఫిలిం చాంబర్ చైర్మన్ బసిరెడ్డి తెలిపారు. గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్ధతు ఇచ్చింది. ఇదే విషయమై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందిస్తూ.. అందరంద కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపారు. పరిష్కారం దొరికే వరకు షూటింగ్లను నిర్వహించమని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే తెలుగు సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయిందన్న కారణంతో నిర్మాతలు గత కొన్ని రోజులు సినిమా షూటింగ్లను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై గతంతో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం సమావేశంపై ఫిలించాంబర్ సినిమాల చిత్రీకరణలను ఆపాలనే నిర్ణయానికి వచ్చింది. ఫిలించాంబర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..