AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2 : హైకోర్టులో అఖండ 2 సినిమాకు షాక్..

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అఖండ 2. డిసెంబర్ 2న విడుదల కావాల్సిన ఈ మూవీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని సమస్యలు తొలగిపోయి ఇప్పుడు డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమాకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.

Akhanda 2 : హైకోర్టులో అఖండ 2 సినిమాకు షాక్..
Balakrishna Akhanda 2 Movie
Rajitha Chanti
|

Updated on: Dec 11, 2025 | 3:31 PM

Share

అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్‌ తగిలింది. ఈ సినిమా ప్రీయయర్‌ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతున్న ఈసినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ క్రమంలో అఖండ 2 తాండవం సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టికెట్ ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోల నిర్వహాణపై కూడా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ మూవీ టికెట్ హైక్స్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

అఖండ 2 సినిమా టికెట్ ధరలను డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమితి ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై రూ.50, మల్టీప్లెక్స్ లో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. డిసెంబర్ 11న ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ అనుమతితోపాటు చిత్రటీంకు ప్రభుత్వం ఒక షరతు సైతం విధించింది. టికెట్స్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..