AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బోనీకపూర్.. ఇద్దరి మధ్య గొడవ దేని గురించో తెలుసా..

SS Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మైదాన్‌’ విడుదల తేదీలపై గత కొన్నిరోజుల నుంచి కోల్డ్‌వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్

SS Rajamouli: రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బోనీకపూర్.. ఇద్దరి మధ్య గొడవ దేని గురించో తెలుసా..
uppula Raju
|

Updated on: Feb 13, 2021 | 2:24 PM

Share

SS Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మైదాన్‌’ విడుదల తేదీలపై గత కొన్నిరోజుల నుంచి కోల్డ్‌వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన చిత్రాలను విడుదల చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు సినిమాల గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ‘మైదాన్‌’ మూవీల్లో అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే మైదాన్ చిత్రాన్ని గతేడాదిలోనే విడుదల చేయాలనుకున్నాం. కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. సినిమా కోసం మేము అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టాం. ఈ ఏడాదిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించిన సమయంలోనే అక్టోబర్‌ 15న ‘మైదాన్‌’ విడుదల చేస్తామని ప్రకటించాం. అయితే మా సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని రోజులకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి, ఇతర చిత్రబృందం ప్రకటించింది. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఒకే హీరోకు చెందిన రెండు భారీ ప్రాజెక్ట్‌లు రెండు రోజుల తేడాతో విడుదల కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విడుదల తేదీల విషయమై ఇటీవల నేను రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడాను. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన సమాధానం చెప్పారు. కానీ ఆయన మాటల్ని నేను నమ్మాలనుకోవడం లేదు. ఇండస్ట్రీలో మంచి పేరున్న రాజమౌళి నుంచి ఇలాంటి చర్య ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా చిత్రీకరణ కంటే గ్రాఫిక్స్‌కే ఎక్కువ ఖర్చు చేస్తోన్న జక్కన్న.. మరో విజువల్ వండర్‌గా ఆర్.ఆర్.ఆర్