AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ క్రేజీ కాంబో రిపీట్ కానుందా ? ‘ఖిలాడి’ తర్వాత మరోసారి ఆ డైరెక్టర్‏తో మాస్ రాజా సినిమా చేయనున్నాడా ?

ఇటీవల విడుదలైన 'క్రాక్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మాస్ మాహారాజా రవితేజ ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ.. రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు.

మళ్లీ క్రేజీ కాంబో రిపీట్ కానుందా ? 'ఖిలాడి' తర్వాత మరోసారి ఆ డైరెక్టర్‏తో మాస్ రాజా సినిమా చేయనున్నాడా ?
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2021 | 6:49 PM

Share

Actor Raviteja Next Movie Update: ఇటీవల విడుదలైన ‘క్రాక్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మాస్ మాహారాజా రవితేజ ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రవితేజ.. రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఖిలాడీ’ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఇందులో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో హీరో అర్జున్, అనసూయ, నికితిన్ ధీర్ కీలకపాత్రల్లో నటిస్తున్న విషయం తేలిసిందే. ఇక ఈ మూవీ మే 28న థియేటర్లలోకి రానుంది. తాజాగా రవితేజ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లుగా సమాచారం.

‘ఖిలాడి’ మూవీ తర్వాత మాస్ రాజా రవితేజ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏గా సినిమా చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరీ కాంబోలో వచ్చిన ఐదు సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనాన్నా ఓ తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు థియేటర్ల వద్ద మంచి విజయం సాధించాయి. తాజాగా వీరిద్దరీ కాంబోలో మరో మూవీ తెరకెక్కనున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ .. విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read:

మరో సర్‏ఫ్రైజ్ ఇచ్చిన ‘ఖిలాడీ’ టీం.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్.. వెల్‏కమ్ చెప్పిన చిత్రయూనిట్..