నవంబర్ నుంచి ‘విరాట పర్వం’లో రానా..!
టాలీవుడ్లో షూటింగ్ల హవా మొదలైంది. ఆర్ఆర్ఆర్ సహా పలు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వారు కూడా షూటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు
Virata parvam shooting: టాలీవుడ్లో షూటింగ్ల హవా మొదలైంది. ఆర్ఆర్ఆర్ సహా పలు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వారు కూడా షూటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దగ్గుబాటి రానా కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రానా విరాట పర్వంలో నటిస్తుండగా.. నవంబర్ మొదటి నుంచి షూటింగ్ని ప్రారంభించాలని మూవీ యూనిట్ భావిస్తోందట. ఇక ఈ మూవీకి సంబంధించిన కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. అది ఒక్క షెడ్యూల్లోనే ఆ మొత్తాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారట.
కాగా ఈ మూవీలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. ప్రియమణి, నందితాదాస్, జరీనా ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి రావడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో విరాట పర్వంను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. మావోల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Read More: