‘సర్కారు వారి పాట’ను వాయిదా వేయాలనుకుంటోన్న మహేష్..!
ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరుతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, తదుపరి చిత్రంగా పరశురామ్తో సర్కారు వారి పాటను ప్రకటించిన విషయం తెలిసిందే.
Mahesh Babu News: ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరుతో మరో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, తదుపరి చిత్రంగా పరశురామ్తో సర్కారు వారి పాటను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక మహేష్ కోసం నాగచైతన్య మూవీని పక్కన పెట్టిన పరశురామ్.. షూటింగ్కి సంబంధించి ఇటీవల లొకేషన్లను కూడా ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే మహేష్ అతడికి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని వాయిదా వేయాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు గల కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని సమాచారం.
ఇటీవల ఖలేజా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ తన అభిమానులకు హింట్ ఇచ్చారు. త్రివిక్రమ్, తాను త్వరలోనే కలిసి పనిచేయబోతున్నట్లు మహేష్ చెప్పారు. దీంతో మహేష్-త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్తో మాటల మాంత్రికుడు ఓ మూవీని ప్రకటించారు. అయితే ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నందున ఇందులో జాయిన్ అయ్యేసరికి మరింత సమయం పట్టనుంది. ఈ క్రమంలో మహేష్తో ఆ లోపు మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయన మహేష్ దగ్గర ప్రస్తావించడం, అందుకు ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. అందుకే మొదట త్రివిక్రమ్తో మహేష్ పనిచేయనున్నాడని, ఆ తరువాత సర్కారు వారి పాటలో నటించనున్నాడని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read More: