Tollywood: గర్భిణీలు ఈ సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ విన్నపం
ఈ క్రమంలోనే తాజాగా చిత్ర ఈ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. సినిమాను వీక్షించి సెన్సార్ సభ్యులు 'పిండం' మూవీకి 'A' సర్టిఫికేట్ను ఇచ్చారు. దీనిబట్టే ఈ సినిమాలో ఎలిమెంట్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. సినిమాకు 'A' సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే...

ఇప్పటి వరకు చూడని అత్యంత భయంకరమైన సినిమా (ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్) అనే ట్యాగ్లైన్తో తెరకెక్కిన సినిమా ‘పిండం’. శ్రీరామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ట్రైలర్తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మేకర్స్. డిసెంబర్ 15వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉందీ చిత్రం.
ఈ క్రమంలోనే తాజాగా చిత్ర ఈ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. సినిమాను వీక్షించి సెన్సార్ సభ్యులు ‘పిండం’ మూవీకి ‘A’ సర్టిఫికేట్ను ఇచ్చారు. దీనిబట్టే ఈ సినిమాలో ఎలిమెంట్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాను గర్భిణీలు చూడకండి అంటూ చిత్ర యూనిట్ ఒక హెచ్చరికను జారీ చేయడం గమనార్హం.
పిండం చిత్ర యూనిట్ చేసిన ట్వీట్..
The scariest film gets more scarier!!#PINDAM certified with a clean “A” Certificate. In theatres worldwide from December 15th 🔥
Statutory Warning: Pregnant women are adviced not to watch this film.@saikirandaida @Yeshwan71014110 @EswariRao @kalaahimedia… pic.twitter.com/7HwLw3EQHE
— Vamsi Kaka (@vamsikaka) December 11, 2023
దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. చిత్ర యూనిట్ ఇంతలా భయపెడుతోన్న ఈ సినిమాలో అసలు ఏముందన్న దానిపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. దీంతో హార్రర్ మూవీస్ను ఇష్టపడే వారిని ‘పిండం’ కచ్చితంగా ఎగ్జైట్కి గురి చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.
పిండం మూవీ ట్రైలర్..
ఇక పిండం కథ విషయానికొస్తే.. ఓ మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లోకి శ్రీరామ్ తన కుంటుంబంతో వస్తాడు. ఇంట్లో అడుగుపెట్టిన అనంతరం అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఏం జరుగుతుంది.? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..