AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eagle OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా ‘ఈగల్’.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఎప్పటిలాగే ఈ మూవీలో రవితేజ తన నటనతో అదరగొట్టేశారు.

Eagle OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా 'ఈగల్'.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
Eagle Movie OTT
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2024 | 5:03 PM

Share

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మాస్ మాహారాజా రవితేజ. ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ.. ఆతర్వాత ‘ఈగల్’ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఎప్పటిలాగే ఈ మూవీలో రవితేజ తన నటనతో అదరగొట్టేశారు. ఇక కార్తీక్ తీసుకున్న కంటెంట్.. తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ మూవీకి ఊహించని స్థాయిలో వసూళ్లు అందించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఫిక్స్ చేసింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ రవితేజ ఈగల్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ రిలీజ్ చేసినట్లు సమాచారం. అయితే ఎప్పటినుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందనే విషయాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన తేదీ నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా కథ విషయానికి వస్తే.. జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ కథనంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆమె ఓ వ్యక్తి గురించి రాసిన ఆర్టికల్ పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈగల్ నెట్ వర్క్ కు సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. అయితే ఈ నెట్ వర్క్ ను సహదేవ్ వర్మ (రవితేజ) నడుపుతుంటాడు. ఈ నెట్ వర్క్ మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్, నక్సలైట్లు, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకీ టార్గెట్ అవుతుంది. ఈ నెట్ వర్క్ మూలాలు ఏపీలోని ఓ అడవుల్లో బయటపడతాయి. ఈగల్ నెట్ వర్క్.. ఆ అడవులకు సంబంధం ఏంటీ ?.. అసలు సహదేవ్ వర్మ ఎవరు ?.. అతడి గతమేంటీ ? అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.