ఎన్టీఆర్కు అతిలోక సుందరి తనయ ఓకే చెప్తుందా..!
అతిలోకసుందరి శ్రీదేవీ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ను టాలీవుడ్లోకి తీసుకొచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. హీరోయిన్గా జాన్వీ ఎంట్రీ టాలీవుడ్ నుంచే మొదలవ్వాలని భావించిన పలువురు దర్శకనిర్మాతలు.. శ్రీదేవీ బతికున్నప్పుడు ఈ విషయంపై ఆమెను సంప్రదించారు కూడా. కానీ కుదరలేకపోయింది. ఇక దఢక్ ద్వారా హీరోయిన్గా జాన్వీ ఎంట్రీ జరగ్గా.. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఫైటర్లో కూడా జాన్వీని తీసుకోవాలని దర్శకుడు పూరీ ప్రయత్నాలు […]
అతిలోకసుందరి శ్రీదేవీ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ను టాలీవుడ్లోకి తీసుకొచ్చేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. హీరోయిన్గా జాన్వీ ఎంట్రీ టాలీవుడ్ నుంచే మొదలవ్వాలని భావించిన పలువురు దర్శకనిర్మాతలు.. శ్రీదేవీ బతికున్నప్పుడు ఈ విషయంపై ఆమెను సంప్రదించారు కూడా. కానీ కుదరలేకపోయింది. ఇక దఢక్ ద్వారా హీరోయిన్గా జాన్వీ ఎంట్రీ జరగ్గా.. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఫైటర్లో కూడా జాన్వీని తీసుకోవాలని దర్శకుడు పూరీ ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అది కూడా కుదరలేదు.
ఇక తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే 30వ చిత్రంలో జాన్వీని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఒక హీరోయిన్గా పూజా ఓకే అయినట్లు తెలుస్తుండగా.. మరో హీరోయిన్గా జాన్వీని తీసుకోవాలనుకుంటున్నట్లు టాక్. దీనిపై ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు జాన్వీ ఒప్పుకుంటే.. టాలీవుడ్లో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దొరికినట్లే. కాగా ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగష్టు లేదా సెప్టెంబర్లో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అరవింద సమేత తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: మీ త్యాగాలు మరువలేనివి.. పోలీసు కుటుంబాలకు ఏపీ డీజీపీ లేఖ..!