పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తిచేసిన నాగార్జున.. వారితో నటించడం అద్భుతం అంటూ ట్వీట్..
హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నాడు.
హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను నాగార్జున పూర్తిచేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేసాడు.
“రణ్ భీర్ కపూర్, అలియా భట్ వాళ్లతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది.. ఇదో అద్భుతమైన అనుభవం. అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమాను చూడాలని ఆతృతగా ఎదురుచుస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో అయాన్ ముఖర్జీ, రణ్ బీర్ కపూర్, అలియా భట్తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇందులో నాగ్.. ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు. లాక్ డౌన్ కంటే ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.. తర్వాత కొద్ది రోజులు వాయిదా పడింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభంకాగా.. నాగార్జున తన డేట్స్ ఇచ్చి షూటింగ్ ఫినిష్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
And it’s a wrap for me on #Brahmāstra . Such an amazing experience it has been with our stellar performers #Ranbir and @Aliaa08. Can’t wait for you guys to witness the outstanding world #AyanMukerji has created.#TheBigIndianMovie #Brahmastra pic.twitter.com/CvKBAVphnt
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 16, 2021
Also Read:
Acharya Movie Shooting: ఆచార్య మూవీ యాక్షన్ సీన్ షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న చరణ్