‘మహర్షి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్లుగా వెంకీ, విజయ్ దేవరకొండ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. నెక్లెస్ రోడ్ లోని ‘పీపుల్స్ ప్లాజా’లో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు జరగనుంది. కాగా ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, రౌడీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. […]

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. నెక్లెస్ రోడ్ లోని ‘పీపుల్స్ ప్లాజా’లో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు జరగనుంది.
కాగా ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, రౌడీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ను రాత్రి 8.10 నిమిషాలకు ఈ వేడుకలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరికొత్త లుక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.




