AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి సందడి 2: హీరోయిన్‌గా ఖుషీ కపూర్..!

దాదాపు మూడేళ్ల తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. 1996లో తాను తెరకెక్కించిన పెళ్లి సందడి సీక్వెల్‌ని తీయబోతున్నట్లు దర్శకేంద్రుడు ప్రకటించారు

పెళ్లి సందడి 2: హీరోయిన్‌గా ఖుషీ కపూర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 9:41 AM

Share

Raghavendra Rao Pelli Sandadi 2: దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. 1996లో తాను తెరకెక్కించిన పెళ్లి సందడి సీక్వెల్‌ని తీయబోతున్నట్లు దర్శకేంద్రుడు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో హీరోగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ పేరు వినిపిస్తోంది. నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా పరిచయం అయిన రోషన్‌.. ఆ మూవీతో నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి సందడి సీక్వెల్‌ కోసం రాఘవేంద్రరావు రోషన్‌ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా అతిలోకసుందరి తనయ జాన్వీ పేరు వినిపిస్తోంది. శ్రీదేవి కుటుంబంతో రాఘవేంద్రరావుకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఖుషీ ఎంట్రీకి సంబంధించి ఇప్పటికే దర్శకేంద్రుడు, బోనికపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అంతా ఓకే అయితే ఈ మూవీ ద్వారా ఖుషీ కపూర్ హీరోయిన్ ఎంట్రీ జరగుతుంది. కాగా ఇప్పటికే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ వరుస సినిమాలతో దూసుకుపోతుండగా.. ఖుషీ కూడా త్వరలో బిజీ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. కాగా పెళ్లి సందడిలో శ్రీకాంత్‌, రవళి, దీప్ని పట్నాగర్ నటించారు. ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించగా.. శ్రీకాంత్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Read More:

Bigg Boss 4: మోనాల్ చేష్టలు.. నాకు చాలా గలీజ్‌గా ఉందన్న అఖిల్

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,717 కొత్త కేసులు.. 5 మరణాలు