జనసేనానీ! సీఎం కాదల్చుకుంటే మూడు దారులున్నాయ్!
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఘోరంగా ఓటమిపాలైతే.. ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారం చేపట్టింది. ఇక ఎంతోకొంత ప్రభావితం చూపుతుందనుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితమయ్యింది. ఇక ఫలితాల అనంతరం టీడీపీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీలు మూకుమ్మడిగా బీజేపీలోకి చేరి.. రేపో మాపో టీడీపీని బీజేపీలో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు […]

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఘోరంగా ఓటమిపాలైతే.. ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారం చేపట్టింది. ఇక ఎంతోకొంత ప్రభావితం చూపుతుందనుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితమయ్యింది. ఇక ఫలితాల అనంతరం టీడీపీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీలు మూకుమ్మడిగా బీజేపీలోకి చేరి.. రేపో మాపో టీడీపీని బీజేపీలో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ తరుణంలో వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేన పార్టీ అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగా మూవీ క్రిటిక్ కత్తి మహేష్.. 2024కు పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి తన దగ్గర మూడు దారులున్నాయన్నాడు. వాటి గురించి ప్రస్తావిస్తూ తన ఫేస్బుక్లో సంచలన పోస్ట్ పెట్టాడు. పోస్ట్ కొంచెం లెంగ్తీగా ఉన్నా.. ప్రస్తుతం ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ కత్తి మహేష్ చెప్పే ఆ మూడు దారులు ఏంటో ఆయన మాటల్లోనే…
‘నాకన్నా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్కి ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో పవన్ గెలవలేదని, మాములుగా తాగే రెండుపెగ్గులకి మరో రెండు కలిపికొట్టి నా విషాదాన్ని మిత్రులతో పంచుకున్నాను. అప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మీద, జనసేన పార్టీ మీద బెంగతో చచ్చిపోతున్నాను. ఏంచేస్తే 2024 నాటికి పార్టీకి, పవన్కి రాజకీయపునర్జీవం వస్తుంది అనే విషయంపై నాకున్న మూడు దారుల స్ట్రాటజీ ఇక్కడ పెడుతున్నాను.
1.మొదటి దారి.. : తెలుగుదేశం పార్టీ ఎలాగూ కనుమారుగైపోతొంది గనక, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి అంటే, జనసేన గ్రామస్థాయి, మండలస్థాయి,జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుతో బలపడి. మానవవనరుల ఏర్పాటు చేసుకోవాలి. క్యాడర్ నిర్మాణం జరగాలి. జీరో బడ్జెట్ బెస్ట్ పాలిటిక్స్ అంటున్నారుగనక ప్రజల నుంచీ సానుభూతిపరుల నుంచీ తగినంత ఆర్థికవనరులు జమచేసుకోవాలి. కాపు ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లాలే కాకుండా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాధ్ర, రాయలసీమల్లోకూడా ఫోకస్ పెట్టాలి. కనీసం 50-60 నియోజకవర్గాలలో లీడర్షిప్ ని గుర్తించి,ప్రజలతో మమేకమై ప్రజాపోరాటాల దిశగా పనిచేసేలా చెయ్యాలి. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందకపోయినా,అమలు సరిగ్గా కాకపోయినా,అవినీతి జరిగినా లోకల్ గా ప్రశ్నించి ఉద్యమాలు చేసే స్థాయిలో వీళ్ళు ఉంటే, ఆటోమేటిక్ గా జనసేన నుంచీ ఎమ్మెల్యేలుగా వీళ్ళే ప్రాజెక్ట్ అవుతారు. జనసేన పార్టీ ప్రజల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీలైనన్ని సార్లు ఈ నియోజకవర్గాలను విజిట్ చేస్తూ, రాష్ట్ర స్థాయి ఉద్యమాలు సమీక్షలు చేస్తే చాలు.
2.రెండోదారి.. : బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసి, వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్లో ట్రైచేస్తున్నారు. కానీ ఆపార్టీలో జనాకర్షణ ఉన్న నాయకులు లేరు. జనసేనకు బీజేపీలో విలీనం చేసేసి, పవన్ కళ్యాణ్ బీజేపీ పగ్గాలు పట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆర్ధిక,మానవవనరుల గురించి ఆలోచన అవసరం లేదు. ఘర్షణ,పోరాట దీక్షలు అవసరం లేదు. ఈజీగా లైఫ్ లో సక్సెస్ఫుల్ రాజకీయనాయకుడు అయిపోతాడు. అదృష్టం వారిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కాకపోయినా ఎదో ఒక రాష్ట్రానికి గవర్నరో, దేశానికి ఉపరాష్ట్రపతో అయిపోతాడు.
3.మూడోదారి.. : చంద్రబాబు బలహీనంగా ఉన్నాడు. తెలుగుదేశం ఉంటుందో ఊడుతుందో తెలీదు. కమ్మలు తెప్పటగలేస్తున్నారు. కాపులు పార్టీని వదిలేసే ప్రమాదం కనిపిస్తోంది. లోకేష్ ను భవిష్యత్తుగా ఉహించుకోవడానికి పార్టీవాళ్లకే కష్టంగా ఉంది. ఈ టైంలో కాపుల్ని మల్లేసుకొచ్చే గొర్రెల కాపరిలా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే…తెలుగుదేశం లో నెంబర్ టూ పొజిషన్ గ్యారంటీ. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లకు, చంద్రబాబు పోయేనాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి.. ఇది నా ప్రణాళిక…ఏమంటారు?’ అంటూ జనసేనానికి మూడు సలహాలు ఇచ్చాడు కత్తి మహేష్.
అటు ఈ పోస్ట్ చూసిన జనసైనికులు ఎప్పటిలానే కత్తి మహేష్పై కామెంట్స్తో దండయాత్రకు దిగారు.
