‘జాతి రత్నాలు’ మూవీ రిలీజ్ డేట్ లాక్.. సమ్మర్లో అలరించనున్న కామెడీ ఎంటర్టైనర్..
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ హీరో నవీన్ పాలిషెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'జాతిరత్నాలు'. ఈ మూవీలో
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ హీరో నవీన్ పాలిషెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతిరత్నాలు’. ఈ మూవీలో టాలీవుడ్ కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
సమ్మర్లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక వాటి జాబితాలోకి ‘జాతిరత్నాలు’ చిత్రం కూడా వచ్చింది. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇంట్లో కాదు థియేటర్లలో చూసుకుందాం. రండి నవ్వుకుందాం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మొత్తానికి వేసవిలో అలరించేందుకు రాబోతోంది ‘జాతిరత్నాలు’.
ఇంట్లో కాదు థియేటర్స్ లో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం.#JathiRatnalu March 11th Release.https://t.co/hn9S3vCMYY#జాతిరత్నాలు @NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul #AnudeepKV #Radhan #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema @LahariMusic #JathiRatnaluOnMar11 pic.twitter.com/HmZX0oJbZX
— Swapna Cinema (@SwapnaCinema) January 24, 2021
Also Read:
Avika Gor : మెగా హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న చిన్నారి పెళ్లికూతురు.. ఆ హీరో ఎవరంటే..