AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాన్ని భరించలేకపోయేదాన్ని.. ఆ భయం నాకెప్పుడూ ఉంటుంది

గత కొన్నేళ్లుగా దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన జీవితం, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను నయనతార వెల్లడించింది. పదేళ్లలో తాను ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని చెప్పిన నయన్.. తాను ఆలోచించే ప్రతి విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని అనుకోనని పేర్కొంది. చాలాసార్లు తాను చెప్పిన మాటలను తప్పుగా రాశారని.. అవన్నీ భరించలేకపోయేదానన్ని తెలిపింది. ‘‘సినిమాల్లో నటించడం మాత్రమే తన […]

దాన్ని భరించలేకపోయేదాన్ని.. ఆ భయం నాకెప్పుడూ ఉంటుంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 1:20 PM

Share

గత కొన్నేళ్లుగా దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన జీవితం, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను నయనతార వెల్లడించింది. పదేళ్లలో తాను ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని చెప్పిన నయన్.. తాను ఆలోచించే ప్రతి విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని అనుకోనని పేర్కొంది. చాలాసార్లు తాను చెప్పిన మాటలను తప్పుగా రాశారని.. అవన్నీ భరించలేకపోయేదానన్ని తెలిపింది. ‘‘సినిమాల్లో నటించడం మాత్రమే తన వృత్తి అని..  తానేంటో తన సినిమాలే  చెప్తాయి’’ అని నయన్ చెప్పుకొచ్చింది.

ఇక అందరిలో తాను త్వరగా కలిసిపోలేనని కూడా నయన్ వెల్లడించింది. ‘‘2011లో సినిమాలకు నేను దూరంగా ఉన్నప్పుడు.. నా సినిమాలు, పాటలు ప్రసారం అయ్య ఛానెళ్లను కూడా నేను చూడలేదు’’ అని లేడి సూపర్‌స్టార్ తెలిపింది. ‘‘వరుస సినిమాలతో నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. మంచి సినిమాను అందించలేనేమోనన్న భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది. అలాగే విజయాలు వస్తే దాన్ని తలకెక్కించుకోను. నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ను.  అనవసరమైన అన్ని వివాదాలను స్పందించాలని కూడా నేను అనుకోను’’ అంటూ ఆమె పేర్కొంది.

కాగా ఈ ఏడాది నయనతార విశ్వాసం, ఐరా, మిస్టర్ లోకల్, లవ్ యాక్షన్ డ్రామా, సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో ఐరా, మిస్టర్ లోకల్ మినహా మిగిలినవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక విజయ్ సరసన ఆమె నటించిన బిగిల్(తెలుగులో విజిల్) దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు రజనీ సరసన దర్బార్ మూవీలో నటించగా.. అది వచ్చే ఏడాది విడుదల కానుంది.