AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సరీస్‌పై ఫోకస్ పెట్టిన మహేశ్ డైరెక్టర్.. అతడి ప్రాజెక్ట్ పక్కన పెట్టడం వల్లే ఇలా చేస్తున్నాడా!

టాలీవుడ్‌లో సక్సెస్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి అందరికి తెలిసిన విషయమే. విభిన్న కోణంలో సినిమా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.

వెబ్ సరీస్‌పై ఫోకస్ పెట్టిన మహేశ్ డైరెక్టర్.. అతడి ప్రాజెక్ట్ పక్కన పెట్టడం వల్లే ఇలా చేస్తున్నాడా!
uppula Raju
|

Updated on: Jan 24, 2021 | 12:31 PM

Share

టాలీవుడ్‌లో సక్సెస్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి అందరికి తెలిసిన విషయమే. విభిన్న కోణంలో సినిమా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా చాలా మంది హీరోలకు విజయాన్ని అందించాడు. వంశీ పైడిపల్లి చివరి సారిగా డైరెక్ట్ చేసిన సినిమా మహర్షి. మహేశ్ బాబుతో చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తదుపరి సినిమా కూడా అతడితోనే చేయాలనుకున్నాడు కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాల్సివచ్చింది. దీంతో ఇప్పుడు ఈయన వెబ్ సిరీస్‌లపై ‌దృష్టి సారించాడని తెలుస్తోంది.

తాజాగా సారధి స్టూడియోలో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలుపెట్టబోతునట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఎనౌన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే వంశీ ఈ సారి వెబ్ సిరీస్ కోసం ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారో చూడాలి. జనరల్‌గా వంశీ పైడిపల్లి అంటేనే ప్రేక్షకులు కంటెంట్‌పై భారీ హోప్స్ పెట్టుకుంటారు. మరి వారి అంచనాలను రీచ్ అవుతాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఒక్క రోజు ముఖ్యమంత్రి.. అద్భుత అవకాశం దక్కించుకున్న ఇరవై ఏళ్ల యువతి..