Rakshasudu 2: అందరూ అనుకుంటున్నట్లు రాక్షసుడు 2 సీక్వెల్ కాదట.. అసలు విషయం చెప్పేసిన దర్శకుడు..
Rakshasudu 2: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అపుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా రాక్షసుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు, తమిళంలో...
Rakshasudu 2: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అపుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా రాక్షసుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు, తమిళంలో ఏక కాలంలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది. ఒక సైకో కిల్లర్ బాలికలను సీరియల్ మర్డర్స్కు సంబంధించి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు భయపెట్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు రాక్షసుడి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది.
రాక్షసుడు2 పేరుతో సినిమాను చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా రాక్షసుడు చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతోందని, సైకో కిల్లర్ కథంశానికి కొనసాగింపుగా రానుందని భావించారు. కానీ ఈ వార్తలన్నింటికీ చిత్ర యూనిట్ తాజాగా ఫుల్స్టాప్ పెట్టింది. రాక్షసుడు సినిమా విడుదలై మూడేళ్లు గడుస్తోన్న సందర్భంగా చిత్ర యూనిట్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను పోస్ట్ చేస్తూ.. ‘రాక్షసుడు సినిమా విడుదలై మూడేళ్లు గడుస్తోన్న సందర్భంగా. రాక్షసుడు 2ని రెట్టించిన థ్రిల్, సస్సెన్స్తో తీసుకురానున్నాము. త్వరలోనే షూటింగ్ ప్రారభం కానుంది. శ్వాసను బిగపట్టుకోండి’ అంటూ దర్శకుడు రమేశ్ వర్మ ట్వీట్ చేశారు.
3 Years For Spine-Chilling Thriller #Rakshasudu ?
We’re Excited to Bring the #Rakshasudu2 with Double the Thrill and Suspense ?
Shoot Starts Soon ?
Hold your Breath because We are coming with a Bang ❤️? pic.twitter.com/TX7JzK0fhN
— Ramesh Varma (@DirRameshVarma) August 2, 2022
దీంతో గత కొన్ని రోజులుగా రాక్షసుడు2 సీక్వెల్ అని జరుగుతోన్న ప్రచారానికి చెక్ పడినట్లైంది. ఇదిలా ఉంటే రాక్షసుడు 2 సినిమాను ఏ స్టూడియోస్ ఎల్ఎల్పీ, మూవీ హిల్స్, హవీష్ ప్రొడక్షన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..