Arun Bali : ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత..
ఆయన నటించిన చివరి చిత్రం గుడ్ బై. అక్టోబర్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇందులో అమితాబ్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో నటించగా.. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.
చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు అరుణ్ బాలీ (79) శుక్రవారం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అరుదైన దీర్ఘకాలిక నాడీ కండరాల వ్యాధి మస్తీనియా గ్రావిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ముంబైలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అరుణ్ బాలీ మృతి పట్ల పలువరు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం గుడ్ బై. అక్టోబర్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇందులో అమితాబ్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో నటించగా.. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.
1942లో పంజాబ్లోని జలంధర్లో అరుణ్ బాలీ జన్మించారు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 1991 పీరియడ్ డ్రామా చాణక్యతో సహా అనేక సినిమాలు.. సీరియల్స్ లో నటించారు. 2000లో వచ్చిన కుంకుమ్ సినిమాలోని హర్షవర్ధన్ వాధ్వా పాత్రతో గుర్తింపు పొందారు. 3 ఇడియట్స్, కేదార్నాథ్ , పానిపట్ ఇతర చిత్రాలలో నటించి మెప్పించారు. ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలోనూ అరుణ్ బాలీ నటించారు.
మస్తీనియా గ్రేవిస్ సమస్యతో బాధపడుతున్న అరుణ్.. ఈ ఏడాది ప్రారంభంలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు అరుణ్ బాలీ కుమారుడు అంకుష్ తెలిపారు.