AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: పాన్‌ మసాల బ్రాండ్‌‌పై బిగ్‌బీ సీరియస్.. లీగల్‌ నోటీసులు పంపిన అమితాబ్ బచ్చన్

నటుడు అమితాబ్ బచ్చన్ ఒక పాన్‌ మసాల బ్రాండ్‌కు లీగల్‌ నోటీసు పంపారు. కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ తనతో కూడిన టీవీ వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేయడంతో లీగల్ నోటీసు పంపించారు.

Amitabh Bachchan: పాన్‌ మసాల బ్రాండ్‌‌పై బిగ్‌బీ సీరియస్.. లీగల్‌ నోటీసులు పంపిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan
Balaraju Goud
|

Updated on: Nov 21, 2021 | 1:35 PM

Share

Amitabh Bachchan sends legal notice: నటుడు అమితాబ్ బచ్చన్ ఒక పాన్‌ మసాల బ్రాండ్‌కు లీగల్‌ నోటీసు పంపారు. కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ తనతో కూడిన టీవీ వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేయడంతో లీగల్ నోటీసు పంపించారు. యువకులు పొగాకుకు అలవాటు పడకుండా చేయడంలో సహాయపడటానికి పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రచారం మానుకోవాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ అభ్యర్థించడంతో అక్టోబర్‌లో కమ్లా పసంద్ ప్రచారం నుండి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రచారం కోసం బచ్చన్ సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయ్యాడు. దీంతెో ఈ ప్రకటనల ప్రసారం రద్దు చేయాలని ‘కమలా పసంద్‌’ పాన్‌ మసాల బ్రాండ్‌కు అమితా బచ్చన్‌ కార్యాలయం నుంచి లీగల్‌ నోటీస్‌ వెళ్లింది. ఇకపై పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రమోషన్లతో అమితాబ్‌ బచ్చన్‌కు సంబంధం లేదని అక్టోబర్‌లో అమితాబ్‌ బచ్చన్‌ కార్యాలయం ఒక పోస్ట్‌ చేసింది.

అమితాబ్‌, పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రకటన ప్రసారం అయిన కొన్ని రోజులకు అందులోనుంచి వైదొలిగారు. ఎందుకంటే ఒప్పందం చేసుకునేప్పుడు, అది సర్రోగేట్‌ అడ్వర్టైజింగ్ కిందకు వస్తుందని తెలియదు. అమితాబ్‌ బచ్చన్‌ ఈ బ్రాండ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ప్రమోషన్‌ కోసం తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చారు.’ అని పోస్టులో పేర్కొంది. ఈ పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రకటనలో నటించిన కారణంగా 79 ఏళ్ల అమితాబ్ బచ్చన్‌కు పలు ఎదురుదెబ్బలు తగిలాయి. స్క్రీన్‌ ఐకాన్‌కు చెందిన పలువురు అభిమానులు ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి అమితాబ్‌ ఎలా ఒప్పుకున్నారని అసంతృప్తి వ్యక్తపరిచారు.

సెప్టెంబర్‌ 2021లో జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ (నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ టొబాకో ఎరాడికేషన్‌-NOTE) అనే ఎన్జీవో కూడా పాన్‌ మసాల బ్రాండ్‌లను ప్రమోట్‌ చేసే ప్రకటనలో భాగం కావొద్దని అమితాబ్‌ బచ్చన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ పాన్‌ మసాల ప్రకటనల నుంచి వైదొలిగి, పొగాకు వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నోట్‌ అ‍ధ్యక్షుడు డాక్టర్‌ శేఖర్ సల్కర్‌ బహిరంగ లేఖలో కోరారు.

Read Also…  CM KCR: తెలంగాణ సర్కార్ నిర్ణయంపై తెలుగు సినీ ప్రముఖుల హర్షం.. సీఎంపై ప్రశంసలు