AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya: ట్రిపులార్‌ షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఆ వ్యాధితో బాధపడ్డారు.. నటి శ్రియా కామెంట్స్‌..

డెడికేషన్‌కు పెట్టింది పేరు దర్శక ధీరుడు రాజమౌళి. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టే జక్కన్న అని పిలుస్తుంటారు. పర్‌ఫెక్షన్‌ కోసం ఎంతో తాపత్రయపడే రాజమౌళి అందుకోసం ఎంతో పరితపిస్తుంటారు. తెరపై కనిపించే..

Shriya: ట్రిపులార్‌ షూటింగ్‌ సమయంలో రాజమౌళి ఆ వ్యాధితో బాధపడ్డారు.. నటి శ్రియా కామెంట్స్‌..
Shriya About Rajamouli
Narender Vaitla
|

Updated on: Dec 02, 2022 | 1:51 PM

Share

డెడికేషన్‌కు పెట్టింది పేరు దర్శక ధీరుడు రాజమౌళి. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టే జక్కన్న అని పిలుస్తుంటారు. పర్‌ఫెక్షన్‌ కోసం ఎంతో తాపత్రయపడే రాజమౌళి అందుకోసం ఎంతో పరితపిస్తుంటారు. తెరపై కనిపించే ప్రతీ సీన్‌లో రాజమౌళి పడ్డ కష్టం కనిపిస్తుంది. రాజమౌళి సినిమా కోసం ఎంతలా కృషి చేస్తారన్నదానికి నటి శ్రియా చెప్పిన ఓ ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. తాజాగా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.

ట్రిపులార్‌ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ.. ‘ట్రిపులార్‌ సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి గారు ఆస్తమాతో బాధపడ్డారు. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. రాజమౌళి గారి దృష్టంతా షూటింగ్‌పైనే ఉంది. ప్రేక్షకులకు కథను ఎంత గొప్పగా ప్రజెంట్‌ చేయాలనే ఆలోచించారు. సెట్‌లో విపరీతంగా దుమ్ము ఉన్నా పని చేశారు. సినిమా అద్భుతంగా ఉండాలని నిరంతరం తాపత్రయపడతారు’ అని చెప్పుకొచ్చారు.

ట్రిపులార్‌ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిందీ చిత్రం. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ నటన.. జక్కన్న దర్శకత్వం సినిమాను విజయ తీరాలకు చేర్చింది. విదేశాల్లోనూ విడుదలైన ఈ సినిమా తాజాగా ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..