AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: పోలింగ్ రోజున బ్లూ షర్ట్‌లో జూ. ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్.. అసలు అంత కథ ఉందా..?

Lok Sabha Poll 2024: ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశం ఇదని భావిస్తున్నాన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

Jr.NTR: పోలింగ్ రోజున బ్లూ షర్ట్‌లో జూ. ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్.. అసలు అంత కథ ఉందా..?
Jr Ntr
Shaik Madar Saheb
|

Updated on: May 13, 2024 | 11:36 AM

Share

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది.. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలతోపాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటుండటంతో భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదయాన్నే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. క్యూలైన్లలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణిత, తల్లి షాలినితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. చిరంజీవి, అల్లు అర్జున్, పలువురు టాప్ స్టార్లు కూడా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశం ఇదని భావిస్తున్నాన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

అయితే.. ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం .. ఆయన ధరించిన షర్ట్.. పోలింగ్ డే రోజున ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకుని వచ్చి ఓటు వేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పోలింగ్ డే రోజున జూనియర్ ఎన్టీఆర్ బ్లూ షర్ట్ లో కనిపించడం వెనుక రాజకీయ కారణం ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. బ్లూ షర్ట్ వేసుకొచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ సిగ్నల్ ఇచ్చారంటూ నెటిజన్లు ఎక్స్ లో షేర్ చేస్తుండటంతో ఇటు సోషల్ మీడియాతోపాటు.. అటు ఏపీ రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

అయితే, ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ లోనే కనపించారని.. ఇలాంటి ప్రచారం అర్ధరహితమని మరికొందరు ఫ్యాన్స్ వాదనలను కొట్టిపడేస్తున్నారు.

మొత్తానికి ఇలా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రెండ్ అవుతున్నారు.. కానీ, దీని వెనుక కథ ఎంటన్నది సస్పెన్స్ గానే మిగిలిపోయింది.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల గురించి, పార్టీల గురించి ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఫ్యాన్స్ కు ఎలాంటి సిగ్నల్ కూడా ఇవ్వలేదని క్లియర్ కట్ గా అర్ధమవుతోంది..

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..