ఆ మూవీ యూనిట్లో ఇద్దరి కరోనా పాజిటివ్..!
కరోనా లాక్డౌన్ వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద మన దేశానికి తీసుకొస్తోన్న విషయం తెలిసిందే.
కరోనా లాక్డౌన్ వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద మన దేశానికి తీసుకొస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది భారతీయులు దేశానికి చేరుకున్నారు. అందులో మలయాళ ‘ఆడుజీవితం’ టీమ్ కూడా ఉంది. సినిమా షూటింగ్కు కోసం జోర్దాన్కి వెళ్లిన ఈ మూవీ టీమ్ ఇటీవలే భారత్కి వచ్చింది. అంతేకాదు వీరందరూ 14 రోజుల క్వారంటైన్ని పూర్తి చేసుకోసుకున్నారు. అయితే తాజాగా ఈ టీమ్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
జోర్దాన్ భాష ట్రాన్స్లేటర్గా వెళ్లిన 58ఏళ్ల వ్యక్తితో పాటు మరో టీమ్ మెంబర్కి కరోనా సోకినట్లు గురువారం తేలింది. ప్రస్తుతం వీరిద్దరు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా బ్లెస్సీ దర్శకత్వం తెరకెక్కిస్తోన్న ‘ఆడుజీవితం’లో ప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన సరసన అమలాపాల్ రొమాన్స్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం టీమ్ జోర్దాన్లోని వాదీ రమ్ ఎడారికి వెళ్లింది. ఇక ఆ సమయంలోనే లాక్డౌన్ విధించడంతో 58 మంది టీమ్ సభ్యులు అక్కడే ఇరుక్కుపోయారు. దాదాపు వంద రోజుల పాటు వీరందరూ అక్కడే ఉండిపోయారు. ఇక గత నెల 22న వీరందరూ సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే ఈ టీమ్లో ఇప్పుడు ఇద్దరికి కరోనా సోకిందని తేలడంతో మిగిలిన టీమ్ ఆందోళనకు గురౌతోంది.
Read This Story Also: రూ.150కోట్ల మేర అక్రమాలు: ఈఎస్ఐ స్కామ్పై ఏసీబీ జేడీ