హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ స్వపన్ దాస్గుప్తాను అభ్యర్థిగా నిలబెట్టింది. రామెందు సింఘారాయ్ టీఎంసీ అభ్యర్థి. 2016, 2011 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీకి చెందిన రక్షపాల్ సింగ్ ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలిచారు. కాని పార్టీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 1951, 57, 62 ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన పార్వతి చరణ్ హజ్రా విజయం సాధించారు. ఆ తరువాత 1967, 69, 71, 77, 82 లో మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రామ్ ఛటర్జీ గెలిచారు. 1972లో కాంగ్రెస్కు చెందిన బలై లాల్ సేథ్ గెలుపొందారు. మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన శాంతి ఛటర్జీ 1987, 91లో గెలిచారు. 1996 నుంచి 2006 వరకు మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు ప్రతిమ్ ఛటర్జీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంఆరు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటులో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 21 వేల 972.