పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా చర్చజరుగుతున్న సీటు తూర్పు మెదినిపూర్ జిల్లాలోని నందిగ్రామ్ సీటు. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టిఎంసి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సుబేందు అధికారి పోటీలో ఉన్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీతో చాలా సన్నిహితంగా మెలుగుతూ.. కీలకంగా వ్యవహరించిన సుబేందు అధికారి.. మమతాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తుండం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారి నందిగ్రామ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1969కి ముందు, నందిగ్రామ్ నార్త్, నందిగ్రామ్ సౌత్ రెండు నియోజకవర్గాలుగా ఉండేవి. అయితే 1969లో డీలిమిటేషన్ తరువాత వీటిని నందిగ్రామ్ సీటుగా మార్చారు. 69 విభజన తరువాత ఈ స్థానంలో సీపీఐ ఐదుసార్లు, సీపీఎం రెండుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు, జనతా పార్టీ ఒకసారి, టీఎంసీ మూడుసార్లు గెలిచింది. 2019 ఓటరు జాబితా ప్రకారం.. ఇక్కడ సుమారు 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.