పశ్చిమ బెంగాల్లోని హాట్ సీట్లల్లో నాడియా జిల్లాలోని కృష్ణానగర్ నార్త్ అసెంబ్లీ సీటు ఒకటి. ఈ స్థానానికి బీజేపీ.. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్రాయ్ను బరిలో దింపింది. టీఎంసీ నటి కౌశాని ముఖర్జీని తన అభ్యర్థిగా ప్రకటించింది. కృష్ణానగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం.. కృష్ణానగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా ఎంపీగా ఉన్నారు. ముకుల్ రాయ్ టీఎంసీలో కీలక నాయకుడు. ఆయన్ను పార్టీ రెండుసార్లు రాజ్యసభకు పంపింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తరువాత రాయ్ రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆ తరువాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరించింది. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన అబానీ మోహన్ భుకర్ ఇక్కడ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్కు చెందిన అసీమ్ కుమార్ సాహాను ఓడించారు.