పశ్చిమ మెడినిపూర్ జిల్లాలోని ఖరగ్పూర్ సదర్ సీటులో టీఎంసీ నేత ప్రదీప్ సర్కార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మినీ ఇండియాగా.. ప్రసిద్ధి చెందిన ఖరగ్పూర్ను రైల్ సిటీ అని కూడా పిలుస్తారు. దేశంలోని మొట్టమొదటి ఐఐటి కూడా ఈ నగరంలో ఉంది. ఈ సీటు గెలవడానికి బీజేపీ శాయశక్తులా ప్రణాళికలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ ఇక్కడ బహిరంగ సభలను సైతం నిర్వహించారు. బీజేపీ నటుడు హిరాన్మోయ్ చటోపాధ్యాయను అభ్యర్థిగా నిలబెట్టగా.. టీఎంసీ ప్రదీప్ సర్కార్కు టికెట్ ఇచ్చింది. 2016లో ఖరగ్పూర్ సదర్ సీటులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ గెలిచారు. ఆతర్వాత జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన మెడినిపూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ బీజేపీ అభ్యర్థి ప్రేమ్చంద్ర ఝాను సుమారు 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు. టీఎంసీ ఈ సీటును గెలవడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్కు చెందిన జ్ఞాన్ సింగ్ సోహన్పాల్ ఈ నియోజకవర్గానికి ఎక్కువకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో బీజేపీ గట్టిపోటీనిస్తోంది. ఈ నియోజకవర్గంలో... బెంగాలీతో పాటు, ఆంధ్రా, ఒడిశా, బీహార్, యూపీ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.