పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలోని దిన్హాటా అసెంబ్లీలో ఈసారి రసవత్తమైన పోటీ జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీని బీజేపీ క్యాండిడేట్గా ప్రకటించగా.. రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిన టిఎంసి మూడోసారి నెలబెట్టింది. కూచ్ బెహార్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ నిసిత్ ప్రమానిక్ కి బీజేపీ దిన్హాటా టికెట్ ఇచ్చింది. ప్రమానిక్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. 2011, 2016 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఎన్నికల్లో గెలిచిన టీఎంసీకి చెందిన ఉదయన్ గుహాపై ఆయన పోటీ చేస్తున్నారు. గుహా 2015లో టీఎంసీలో చేరారు. అప్పటివరకూ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ 7 సార్లు, ఫార్వర్డ్ బ్లాక్ 8 సార్లు, ఒకసారి టీఎంసీ గెలిచింది. 2016 ఎన్నికల్లో తృణమూల్కు చెందిన ఉదయన్ గుహాకు లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అక్షయ్ ఠాకూర్కు సుమారు 79 వేల ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 25 వేల 598 ఓట్లు వచ్చాయి.