ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం కోల్కతా దక్షిణ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని భవానీపూర్ అసెంబ్లీ సీటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదు. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శోభన్ దేవ్ చటోపాధ్యాయను టీఎంసీ బరిలోకి దింపింది. మరోవైపు బీజేపీ నటుడు రుద్రానిల్ ఘోష్ ను ఇక్కడి నుంచి నిలబెట్టింది. ఆయన ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ్ శంకర్ రే కూడా ఈ సీటు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 1957, 62 లో ఇక్కడ నుంచి గెలిచాడు. దీనికి ముందు 1952 లో కాంగ్రెస్ కూడా గెలిచింది. 2011 లో టీఎంసీకి చెందిన సుబ్రతా బక్షి ఇక్కడ నుంచి గెలిచారు. అయితే ఆయన ఈ సీటును ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వదులుకున్నారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మమతా 54 వేల ఓట్ల తేడాతో సీపీఎం అభ్యర్థి నందిని ముఖర్జీని ఓడించారు. 2016 లో దీపా దాస్మున్సీని 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి మమతా బెనర్జీ ఓడించి రెండోసారి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈసారి బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరా పోరు నెలకొంది.