దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బెహ్లా ఈస్ట్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ నటి పాయల్ సర్కార్ను పోటీలో నిలబెట్టింది. మాజీ మంత్రి సోవన్ ఛటర్జీ భార్య రత్న ఛటర్జీకి అధికార టీఎంసీ పార్టీ టికెట్ ఇచ్చింది. 2010 నుంచి 2018 వరకు కోల్కతా మేయర్తోపాటు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సోవన్ ఛటర్జీ.. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయన తన ప్రేయసికి టికెట్ కేటాయించాలని బీజేపీ అధిష్టానాన్ని కోరినప్పటికీ.. బిజెపి పాయల్ సర్కార్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ తరువాత ఆయన పార్టీని విడిచిపెట్టాడు. ఈ స్థానాన్ని 1951 నుంచి వామపక్షాలు గెలుపొందుతూ వచ్చాయి. ఆతర్వాత 1972 లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత సీపీఎం 1977 నుంచి 1996 వరకు విజయం సాధించింది. 2001లో టీఎంసీ నుంచి పరాస్ దత్తా గెలిచారు. 2006 సీపీఎం, 2011 2016 ఎన్నికలలో టీఎంసీ గెలుపొందింది.