బంకురా అసెంబ్లీ సీటు నుంచి టీఎంసీ.. ప్రముఖ సినీ నటి సయంతిక బెనర్జీకి టికెట్ ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే షాంపా దరిపాకు టికెట్ నిరాకరించింది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన షాంపా దరిపా ఆ తరువాత తృణమూల్లో చేరారు. అయితే షాంపా దరిపా.. మళ్లీ టీఎంసీని వీడి.. కాంగ్రెస్లో చేరవచ్చని ఊహగానాలు రావడంతో టీఎంసీ టికెట్ ఇవ్వలేదు. ఈ సీటు బంకురా లోక్సభ నియోజకవర్గంలో వస్తుంది. ఇక్కడ బీజేపీ నీలద్రి శేఖర్ దానాను పోటీలో నిలబెట్టింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన షాంపా దరిపా.. టీఎంసీకి చెందిన మినాటి మిశ్రాను వెయ్యి ఓట్ల తేడాతో ఓడించారు. 2011 ఎన్నికల్లో టీఎంసీ నుంచి కాశీనాథ్ మిశ్రా గెలిచినప్పటికీ 2012 లో ఆయన మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో టీఎంసీ అభ్యర్థి మినాటి మిశ్రా.. సీపీఎం అభ్యర్థి నీలంజన్ దాస్గుప్తాను ఓడించి విజయం సాధించారు.