AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Elections: ఇవాళ ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ.. యూపీ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో ప్రచారం జోరందుకుంది. ఫిబ్రవరి 10న రాష్ట్రంలో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి.

UP Assembly Elections: ఇవాళ ఢిల్లీలో బీజేపీ కీలక భేటీ.. యూపీ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు!
Up Elections
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 20, 2022 | 8:29 PM

Share

Uttar Pradesh Assembly Elections 2022:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో ప్రచారం జోరందుకుంది. ఫిబ్రవరి 10న రాష్ట్రంలో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికల్లో పశ్చిమ యూపీలోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం అవుతోంది.

ఈ సమావేశానికి హాజరయ్యేందుకు యూపీ సిఎం యోగి ఆదిత్య నాథ్‌ సహా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు స్వతంత్ర సింగ్ ఢిల్లీ చేరుకున్నారు. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన పెద్ద నేతలు హాజరవుతున్నారు. అదే స‌మ‌యంలో ఇవాళ జ‌రిగిన స‌మావేశంలో అభ్య‌ర్థుల పేర్ల‌పై అంగీకారం జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. అదే సమయంలో, జాతీయ మీడియా కథనాల ప్రకారం, జనవరి 13 న బీజేపీ అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించే అవకాశముంది.

నిన్న ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో బీజేపీ కీలక సమావేశం జరిగింది. అధిష్టానికి అందించాల్సిన ముఖ్య నేతల జాబితాపై కసరత్తు చేసినట్లు సమాచారం. అయితే, మరోవైపు, సరియైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్లను పార్టీ కట్ చేస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ హాజరుకానున్నారు. అయితే, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రాధా మోహన్ సింగ్‌కు కరోనా సోకినట్లు చెబుతున్నారు. వీరిద్దరు నేతలూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో తొలి దశలో 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను పార్టీ ఈరోజు నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈరోజు జరగనున్న సమావేశం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించి త్వరలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి విడుదల చేయనున్నారు.

అదే సమయంలో సోమవారం లక్నోలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాడ్ ఇమేజ్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వదని, గెలిచే, మన్నికగల అభ్యర్థులకే టికెట్లు ఇస్తుందని మీడియాలో వార్తలు వచ్చాయి.

Read Also….  Lata Mangeshkar: కరోనా బారిన పడిన గాయని లతా మంగేష్కర్.. ఐసీయూలో చికిత్స..