Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi – CM Yogi: సీఎం – ప్రధాని.. అరుదైన ఫోటోను షేర్ చేసిన యూపీ ముఖ్యమంత్రి..

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం లక్నోలో పర్యటిస్తున్నారు. 56వ డీజీపీ-ఐజీపీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు నవంబర్ 19న న్యూఢిల్లీకి వెళ్లిన ప్రధాని మోడీ..

PM Modi - CM Yogi: సీఎం - ప్రధాని.. అరుదైన ఫోటోను షేర్ చేసిన యూపీ ముఖ్యమంత్రి..
Cm Yogi Pm Modi
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:22 PM

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం లక్నోలో పర్యటిస్తున్నారు. 56వ డీజీపీ-ఐజీపీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు నవంబర్ 19న న్యూఢిల్లీకి వెళ్లిన ప్రధాని మోడీ ఈరోజు తిరిగి ఢిల్లీకి రానున్నారు. కాగా, ప్రధాని మోడీతో కలిసి దిగినిన రెండు ఫోటోలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. యోగి జీ షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ,ప్రధాని నరేంద్ర మోడీ కలిసి నడుచుకుంటూ ఏదో అంశాంపై దీర్ఘంగా చర్చిస్తున్న ఫోటో కావడంతో పెద్ద సంచలనంగా మారింది. ఈ అరుదైన ఫోటోలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెండు ఫొటోలను పోస్ట్ చేసిన యోగి ఆదిత్యనాథ్.. నవభారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని ట్యాగ్ చేశారు. ఒక చిన్న కవిత కూడా రాశాడు. “మన ప్రతిజ్ఞతో ముందుకు సాగుతున్నాం. (తన్, మన్) తనువు, మనసు దేశం కోసం అంకితం చేయాలని.. నవభారతాన్ని నిర్మించాలని ప్రతిజ్ఞ  తీసుకున్నాం” అని అందంగా రాశారు.

ఇదిలావుంటే.. ఈ ఫోటోలపై వ్యంగ్యంగా ట్యాగ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో సోషలిస్టు పార్టీ అధికారంలో ఉండగా చేసిన పని ఎక్కువ. ఈసారి అఖిలేష్ గెలుస్తారని మోడీ.. యోగి జీకి చెబుతూ ఉండవచ్చు’’ అని ఎస్పీ అధికార ప్రతినిధి అనురాగ్ బదౌరియా ట్వీట్ చేశారు. అలాగే ఫోటోను కూడా షేర్ చేశారు. చాలా మంది ఈ ఫోటోను అరుదైన ఫోటోగా షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: PM SVANidhi: వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు..!

CM KCR- CM Jagan : జల వివాదం అనంతరం తొలిసారి కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు