Goa Assembly Elections 2022: ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు.. వడ్డీ లేని రుణాలు.. ఎక్కడంటే..

గోవాలో ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉండి, వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుంది. మళ్లీ ఎన్నికైతే ఏం చేస్తామో అధికార పార్టీ చెబుతోంది...

Goa Assembly Elections 2022: ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు.. వడ్డీ లేని రుణాలు.. ఎక్కడంటే..
Goa
Follow us

|

Updated on: Feb 11, 2022 | 7:12 PM

గోవాలో ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉండి, వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుంది. మళ్లీ ఎన్నికైతే ఏం చేస్తామో అధికార పార్టీ చెబుతోంది. అయితే అధికార భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను తయారు చేయడంలో సవాళ్లు ఎదుర్కొంది. గోవాలో అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చే అవకాశం లేనప్పుడు చాలా సులభంగా వాగ్ధానాలు చెస్తుంది. ఎందుకంటే దానిని అమలు చేయవలసిన బాధ్యత తమపై ఉండదని వారికి తెలుసు. గోవా రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన తృణమూల్ కాంగ్రెస్ యువతకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తమ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు బ్యాంకు రుణాలు ఇవ్వడం వంటి అనేక అవాస్తవ వాగ్దానాలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఓటర్లకు ఉచిత విద్యుత్, నీటి వాగ్దానాలు చేసింది.

రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, సిద్ధాంతపరంగా బిజెపిని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా నిరోధించగల ఏకైక పార్టీగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో న్యాయ్ పథకం అమలు చేస్తామని వాగ్దానం చేసింది. హిందీలో న్యాయం అంటే సాంఘిక సంక్షేమ పథకం, అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ. 72,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ వారు అధికారంలోకి రాలేదు.

బీజేపీ తయారు చేసిన గోవా మేనిఫెస్టో ఆకట్టుకునే విధంగా లేదు. బీజేపీ సంకల్ప్-పాత్ర పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతిపక్ష పార్టీల వలె స్పైసిగా లేదు. ఏమి సాధించగలదో వాగ్దానం చేయడానికి ప్రయత్నించింది. మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి మూడు ఉచిత LPG సిలిండర్లు ఇవ్వడం, రాబోయే మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర సుంకం పెంపుదల ఉండదని, పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేయడం, స్థానికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా హోమ్‌స్టే పథకాన్ని ప్రోత్సహించడం, వడ్డీ లేని రుణం, మెరుగైన వైద్యం అందించడం వంటివి ఉన్నాయి. సౌకర్యాలు, స్థానిక రవాణా, సీఫుడ్ ఎగుమతిలో గోవాను అగ్రగామిగా మార్చడం, పేదలకు సబ్సిడీ ఆహారం కోసం అన్నపూర్ణ క్యాంటీన్‌లను ప్రారంభించడం, మహిళలకు రెండు శాతం వడ్డీ రేటుతో, పురుషులకు నాలుగు శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలు ఇవ్వడం, వృద్ధాప్య పింఛను నెలకు రూ. 3,000, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 స్టైఫండ్ ఇవ్వడం, అంతర్జాతీయ కోచ్‌ల ద్వారా ప్రపంచ స్థాయి కోచింగ్ సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి నూతన ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం మొదలైనవి కూడా ఉన్నాయి.

ఒక దశాబ్దంలో గోవాను 50 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, COVID-19 వ్యాప్తి సమయంలో ప్రాథమిక వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా బహిర్గతం అయినప్పుడు గోవాను మెడికల్ టూరిజం కేంద్రంగా మారుస్తామని, FIFA అండర్ -20 ప్రపంచ కప్‌ను తీసుకువస్తామని పార్టీ హామీ ఇచ్చింది. గోవా నుంచి ఒలింపిక్ బంగారు పతక విజేతను తయారు చేయగల సామర్థ్యాన్ని గోవా “గోల్డ్ కోస్ట్”గా మార్చడం. 2018లో సుప్రీంకోర్టు నిషేధించిన ఇనుప ఖనిజం మైనింగ్ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామనే వాగ్దానం అత్యంత ఆసక్తికరమైనది. గోవాలో 2007లో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయి. ఆంక్షలు విధించబడ్డాయి. మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం స్థానికులను తీవ్రంగా ప్రభావితం చేసింది. పర్యాటకంతో పాటు, స్థానికులకు ఇది రెండో అత్యంత లాభదాయకమైన ఆదాయ వనరుగా ఉండేది.

“గోవా అంతటా ఉన్న గ్రేడ్ ఖనిజాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించే కొత్త మైనింగ్ విధానాన్ని మేము ఇప్పటికే రాష్ట్రంలో ప్రకటించాం. రాష్ట్రంలో ఇనుప ఖనిజం బ్లాక్‌లను వేలం వేయడానికి చర్యలు తీసుకున్నాం. గోవా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను కూడా స్థాపించాం. రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో మైనింగ్ కార్యకలాపాల పునరుద్ధరణ, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం ద్వారా గోవా ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరుస్తుంది” అని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బీజేపీ మేనిఫెస్టోలోని 22 పాయింట్లు 40 మంది సభ్యుల అసెంబ్లీలో 22-సీట్లు గెలుచుకోవాలనే నిరాడంబరమైన లక్ష్యాన్ని సూచిస్తున్నాయి.

ఫిబ్రవరి 12న ప్రచారం ముగిసే వరకు విరామం లేకుండా సీనియర్ కేంద్ర నాయకులు రాష్ట్రంలో ప్రచారానికి రావడానికి బీజేపీ ఇప్పటికే కార్పెట్ బాంబింగ్ టైమ్-టెస్ట్ ఫార్ములాను విడుదల చేసింది. పార్టీ చీఫ్ జెపి నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పిటికే రాష్ట్రాన్ని సందర్శించారు. నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ కూడా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు.

Read Also.. Lakhimpur Kheri violence: యూపీలో కీలక పరిణామం.. లఖీంపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో