Variety Theft: పిల్లులు పట్టేవాళ్లమంటూ వచ్చారు.. ఇళ్లంతా దోచుకుని వెళ్లిపోయారు.. తస్మాత్ జాగ్రత్త
దొంగలు రోజురోజుకు అప్డేట్ అవుతున్నారు. వెరైటీ ఐడీయాలతో పోలీసులకుసరికొత్త సవాళ్లు విసురుతున్నారు. తాజాగా పిల్లులు పడతాం అంటూ ఇంట్లోకి వచ్చి కొత్త రీతిలో
Variety Theft: దొంగలు రోజురోజుకు అప్డేట్ అవుతున్నారు. వెరైటీ ఐడీయాలతో పోలీసులకుసరికొత్త సవాళ్లు విసురుతున్నారు. తాజాగా పిల్లులు పడతాం అంటూ ఇంట్లోకి వచ్చి కొత్త రీతిలో దొంగతనానికి పాల్పడింది ఓ ముఠా. పట్టపగలు గ్రామంలో అందరూ చూస్తుండగానే పిల్లులు పట్టేవాళ్లలా వలలు చూపిస్తూ ఇంటివారిని నమ్మించి సుమారు 8 తులాల బంగారం, వెండి పట్టీలు, నగదు ఎత్తుకెళ్లిపోయారు గుర్తుతెలియని వ్యక్తులు.
చిత్తూరు జిల్లా పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఈ వెరైటీ లూటీ జరిగింది. ఐదు వాహనాల్లో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు..మాయమాటలు చెప్పి ఓ ఇళ్లు గుళ్ల చేశారు. మీ ఇంట్లో నల్లపిల్లి దూరిందని..దానిని పట్టుకుంటామని చెప్పి ఆ ముఠా వచ్చిన పని కానిచ్చేసింది. దొంగల ముఠాలోని ఓ మహిళ పిల్లిని పట్టుకొస్తానని చెప్పి ఇంట్లో చొరబడింది. మరోమహిళ ఇంటివారిని మాటల్లో పెట్టింది. బయట హంగామా చేస్తూ..ఇంట్లోకి వెళ్లిన మహిళ..బీరువాలోని బంగారం, వెండి, నగదు సర్దేసింది. నెమ్మదిగా బయటకు వచ్చి నా పనైపోయిందని వెళ్లిపోయింది. దీంతో మిగిలిన వారు కూడా వెళ్లిపోయారు. తీరా ఆ సాయంత్రానికి బీరువా చూసి దొంగతనం జరిగిందని తెలుసుకున్న ఇంట్లోనివాళ్లు.. కంగుతిన్నారు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also Read:
Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?
Chris Gayle: సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్లకాలవే ఎదురొస్తే..? క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్…
Viral Photo: పిచ్చికి పరాకాష్టా..?.. లేక ఫోటోషాపా.. వైరల్ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్